ప్రభాస్ అనుష్క. ఈ ఇద్దరి పేర్లు కలిపేసి చదివితే తప్ప మీడియాకు కిక్కు రాదేమో. ఏదీ లేకపోయినా కూడా పదే పదే రాసేస్తూ మసాలాలు పూసేస్తూ విందు చేసుకోవడం అలవాటు అయిపోయింది మరి. ఓ వైపు ప్రభాస్ నాకేం తెలియదు అంటాడు. అనుష్క కూడా అంతే బుద్ధిగా సమాధానం చెబుతుంది. అయినా ఈ పుకార్లూ వదలవుగా.

 

మరో వైపు వాటిని స్ప్రెడ్ చేసేలా అనుష్క, ప్రభాస్ కూడా అపుడపుడు స్టేట్మెంట్స్ ఇస్తూంటారు. తాజాగా అనుష్క తమ ఇద్దరి మధ్యనే ఏమీ లేదంటూనే కొన్ని కామెంట్స్ చేసింది. అవి ఇపుడు సెన్సేషన్ అవుతున్నాయి. ఇంతకీ అనుష్క ఏమందంటే ప్రభాస్ నేనూ  ఒక్కటేనని. అంటే ఇందులో తప్పుగా అర్ధం చేసుకోవడాలు, ద్వంద్వార్ధాలూ లేవు.

 

ఇద్దరం ఒకే రకమైన స్వభావం కలిగిన వారమని అంటోంది. అంతే తప్ప తాము ఇద్దరం ఎక్కువగా భావోద్వేగంతో ఉంటామని, బయటకు అది చెప్పుకోకుండా ఉండలేమని కూడా అంటోంది. ఇలా ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని అంటోంది.

 

అంతే తప్ప తమ మధ్య వేరే ఏమీ లేదని అనుష్క ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తోంది. అయితే ప్రభాస్ కి తనకు పెళ్ళిళ్ళు కాకపోవడంతో ఎవరికి తోచినట్లుగా వారు రాసుకుంటున్నారని ఆమె అంటోంది. ఇది మంచిది కాదని కూడా అంటోంది. 

 

నిప్పు లేనిదే  పొగ రాదని అంటున్నారని, కానీ నిప్పూ పోగా మీడియావే పెట్టేస్తోందని కూడా అనుష్క మండిపడుతోంది. మొత్తానికి ప్రభాస్ మంచివాడు అంటూ అనుష్క సర్టిఫికేట్ ఇచ్చినా కూడా జనాలకు ఏదోలా సౌండ్  వినిపిస్తోంది. తప్పు ఎవరిదో మరి.

 

ఏది ఏమైనా అనుష్క పెళ్ళి విషయంలో ఈ మధ్య పుకార్లు ఎక్కువగా రావడంతో ఆమె బాగా హర్ట్ అవుతోంది. ఎవరితో ఒకరిని కలిపి ముడేసే మీడియా పట్ల ఆమెలో కోపం కట్టలు తెంచుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: