గత సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమ సినిమాలను విడుదల చేయడం జరిగింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదే విధంగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురంబులో’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నువ్వానేనా అన్నట్టుగా ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటడానికి రెడీ అయితే ఈ సినిమాలో రిలీజ్ చేశారు. అయితే ఈ తరుణంలో అల్లు అర్జున్ పైచేయి సాధించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠ పురంబులో’ ఫ్యామిలి మరియు యూత్ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా బాగా ఆకట్టుకుంది.

 

మరోపక్క  మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పర్వాలేదనిపించాడు.రెండు సినిమాలకి వచ్చిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే...బన్నీ సినిమా కు 160 కోట్లు షేర్ రాగా, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకి 100 కోట్ల షేర్ రావడం జరిగింది. దీంతో రెండు సినిమాలు ఒకరికి ఒకరు తమ వాల్ పోస్టర్ పై సినిమాకి వచ్చిన కలెక్షన్లు పెద్దపెద్ద అక్షరాలతో ముద్రించి తెగ హడావిడి చేశారు.

 

ఇటువంటి తరుణంలో ఇటీవల దక్షిణాదిలో ప్రముఖులపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో త్వరలో రెండు సినిమాల నిర్మాతలకు ఐటీ శాఖ నుండి ప్రశ్నలు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టైంలో అసలు లెక్కలు తేలిపోతాయి అని అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది. అసలు సినిమా కి వచ్చిన కలెక్షన్ ఏంటో ఈ దెబ్బతో అర్థమైపోతుంది అని ఇండస్ట్రీలో ఉన్న వారు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రెండు సినిమాల నిర్మాతలు ఆ టైం లో ప్రతి టికెట్ పై జిఎస్టి చెల్లింపులు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: