అక్కినేని నాగార్జున తన ఇద్దరు కొడుకుల కోసం చాలా పక్కాప్లానింగ్తో వాళ్ళ కెరియర్ కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇటీవల చైతన్య కాస్త దారిలో పడ్డారు కాని అఖిల్ మాత్రం ఎందుకో లక్ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు సినిమాల్లో నటించినప్పటికి ఒక్కటి కూడా ఆశించిన రేంజ్ లో హిట్ రాలేదు. అందుకు ఆయన అఖిల్ విషయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. ఈ మధ్య కాలంలో చైతన్య కెరియర్ గురించి కాస్త సమంత ప్లానింగ్ చేస్తుండడంతో నాగార్జున పూర్తిగా అఖిల్ మీద ఫోకస్ పెట్టారట.
అయితే అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే ఈ చిత్రానికి పెట్టారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయి ముగింపు దశలో ఉంది ఈ చిత్రం. దీంతో నాగర్జున రంగంలోకి దిగారు. సినిమా ఔట్ పుట్ మొత్తాన్ని పరిశీలించి చివరిగా ఆయన చిన్న చిన్న మార్పులు చెప్పారట . టీమ్ ఆయన సలహాల మేరకు ఛేంజెస్ చేసే పనిలో పడ్డారు. అయితే గతంలో కూడా అఖిల్ ప్రతి చిత్రాన్ని దగ్గరుండి పర్యవేక్షించే వారు నాగ్.
అలాగే ఈసారి కూడా చేశారట. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మరి అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి అల్లుఅరవింద్ హ్యాండ్ అన్నా మనోడికి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.