‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత పూర్తిగా నిరాశలో కూరుకుపోయి దాదాపు ఏడాది పాటు మరో సినిమాని కన్ఫామ్ చేయలేదు అల్లు అర్జున్. అటువంటి టైమ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకి ఓకే చెప్పి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. అంతే కాకుండా తన తోటి స్టార్ హీరో మహేష్ బాబు సినిమా నీ అధిగమించి అద్భుతమైన కలెక్షన్లు సాధించాడు. ఇండస్ట్రీలో దాదాపు చాలా వరకూ నాన్ బాహుబలి రికార్డులు కొట్టేసి ఇండస్ట్రీ రికార్డును సాధించాడు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో.

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటువంటి తరుణంలో నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్ కథాంశం విధానంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడాల్సి వస్తోంది. సినిమాలో 6 ప్యాక్‌ కాదు, ఎయిట్‌ ప్యాక్‌తో అల్లు అర్జున్‌ కనిపించనున్నాడంటూ ఊహాగానాలు ఓ పక్క వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం రెమ్యునిరేషన్ విషయంలో అల్లుఅర్జున్ ఒక్కసారిగా డబుల్ చేయటంతో నిర్మాతలు తట్టుకోలేక పోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

 ఒకపక్క కరోనా వైరస్ వల్ల షూటింగ్ వాయిదా పడటం మరోపక్క అల్లుఅర్జున్ రెమ్యూనరేషన్ డబుల్ చేయటంతో...ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు అని ఫిలింనగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో ప్రొడ్యూసర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట బన్నీ. నామినల్‌గా మాత్రమే రెమ్యునరేషన్‌ మొదట తీసుకుని, మిగతా మొత్తం సినిమా విడుదలయ్యాక.. హిట్‌ టాక్‌ వచ్చాక అందుకోవటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: