సరిలేరు నీకెవ్వరు సినిమా ఏ స్థాయిలో హిట్ అయింది అనేది పక్కన పెడితే, ఈ సినిమా మహేష్ బాబుకి మాత్రం నష్టాలు మిగిల్చింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సినిమా మీద మహేష్ బాబు భారీగా పెట్టుబడులు పెట్టాడు అనేది వాస్తవం. ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని భావించారు అనేది వాస్తవం. కాని ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. మహేష్ బాబు పెట్టుకున్న ఆశలను ఈ సినిమా కూల్చేసింది. ఈ సినిమా మహేష్ కెరీర్ లో డిజాస్టర్ అనేది కొందరి మాట. 

 

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అని మహేష్ బాబు భావిస్తున్నారు. మహేష్ బాబు సినిమా బాగా లేదు అని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తూ వచ్చారు. దీనితో సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు కూడా వెనక్కు తగ్గారు. మహేష్ బాబు కి ఈ సినిమా మీద నష్టాలు వచ్చాయని ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో జరిగింది. దీనితో మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియాకు దూరమవ్వాలని భావిస్తున్నాడట. తనకు సోషల్ మీడియా అవసరం లేదని, సోషల్ మీడియాతో తనకు కలిసి వచ్చింది ఏమీ లేదని భావనలో ఉన్నాడట. 

 

సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ అవ్వడానికి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అని ఒక వర్గం తనను టార్గెట్ చేసారని, మహేష్ బాబు భావిస్తున్నారు. అందుకే మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే విధంగా ఒక ప్రకటన కూడా త్వరలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. తర్వాతి సినిమాలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయవద్దని భావిస్తున్నాడట. రివ్యూలు కూడా తనకు ఇబ్బందికరంగా మారాయని మహేష్ బాబు భావిస్తున్నాడట. కాగా ప్రస్తుతం వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: