టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోగా రవితేజ కి మంచి పేరు ఉంది.   ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే విధంగా సినిమాలు కూడా చేయడం జరిగింది. అయితే ఇటీవల వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలా పడిపోయాడు. రాజా ది గ్రేట్ సినిమా ముందు చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రవితేజ ఆ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే తర్వాత చేసిన సినిమాలు మొత్తం వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ కెరీర్ మొత్తం ఇప్పుడు డేంజర్ లో పడింది. చేస్తున్న సినిమాలకు సరైన విజయాలు రాకపోవడంతో పాటు ఆ బయట ఉన్న మార్కెట్ కూడా పోవడంతో రవితేజ తో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు ముందుకు రావటం లేదు.

 

ఇటువంటి నేపథ్యంలో ఒక స్టాండ్ స్టోరీతో రవితేజ త్వరలో సినిమా చేయబోతున్నట్లు కచ్చితంగా ఈ సినిమాతో గ్యారెంటీ హిట్టే రవితేజ కొట్టబోతున్నటు ఇండస్ట్రీలో బలమైన వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీ అని కొన్ని వార్తలు ఇటీవల ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చాయి. మేటర్ లోకి వెళితే వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన చివరి సినిమా నా పేరు సూర్య. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ అయిన సినిమా. దీంతో ఆ సినిమాతో డెడ్ బ్లాక్ అయిన వక్కంతం వంశీ ఇప్పుడు కోలుకున్నాడు. మరో కథ రాసుకున్నాడు.

 

దాన్ని రవితేజకు వినిపించాడు. మాస్ రాజా ఓకే చెప్పాడు. సో.. వక్కంతం మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. మొదటి సినిమాకు సీరియస్ కథను తీసుకున్న ఈ దర్శకుడు.. తన రెండో సినిమాకు మాత్రం ఎంటర్ టైన్ మెంట్ ను నమ్ముకుంటున్నాడు. ఫక్తు మసాలా ఎలిమెంట్స్ తో రవితేజతో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ అన్న ఇండస్ట్రీలో కొంత మంది కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ కి మరియు వక్కంతం వంశీ కి బ్రేక్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: