ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి అని సులువుగా చెప్పవచ్చు. దీనికి కారణం అందరికి తెలిసినదే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు వరుసగా విజయం సాధించడమే ఇందుకు కారణం. మాములుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎవరి జోలికి వెళ్లడు. మాములుగా అంతా సైలెంట్ గా ఉండే దర్శకుడు ఒక ఛానల్ ఒకరిని బండ బూతులు తిట్టడం అనుకుంటున్నారా..? అసలేం ఏం జరిగింది...? నిజానికి సాధ్యమయ్యే పనేనా ఇది నిజంగా ఆయనకు అంత కోపం ఎందుకొచ్చింది.. ఇంతకూ ఆయన తిట్టింది ఏ ఛానల్ ఓనర్‌ అని అనుకుంటున్నారు.  కాకపోతే ఈ సంఘటన జరిగిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు గడిచింది అనుకోండి.

 

 

 
కాకపోతే కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అపజయం అంటూ లేకుండా ముందుకు వెళ్తుంది రాజమౌళి, కొరటాల శివ లాంటి మరికొద్ది మంది దర్శకులు మాత్రమే. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు కూడా ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. అనిల్ కూడా ఇప్పుడు వరసగా 5 సినిమాలు హిట్స్ అందుకున్నాడు. ఇప్పటి వరకు అయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్టే, మొన్న రిలీజ్ ఆయన "సరిలేరు నీకెవ్వరు" సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ ని అందుకుంది. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా భారీ షేర్ ని వసూలు చేసింది. ఈ సినిమాకి ముందు ఆయన f2 సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. వరస సినిమాల విజయాలు అందుకున్న ఈయన కెరీర్ మొదట్లో మాత్రం చాలా అవమానాలే ఎదురయ్యాయి. ఈ విషయాన్ని అయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటకి చెప్పాడు ఈయన. నీకు మాత్రమే చెప్తా షోలో తరుణ్ భాస్కర్ హోస్టుగా వచ్చిన ఇందులో అనిల్ చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు.

 


 
 
నిజానికి అనిల్ డైరెక్ట్ చేసిన పటాస్ సినిమా విడుదలకు ముందు ఒక శాటిలైట్ ఛానెల్ వచ్చి స్పెషల్ షో చూసి ఆయన్ని తిట్టి పోయారని చెప్పాడు. నిజానికి వాళ్ళు ఏమన్నారంటే  వాళ్లు బయటికి వచ్చి అసలు ఇది సినిమానేనా..? ఇలాంటి సినిమా కూడా తీస్తారా..? చెత్త సినిమా..అని అసలు ఒక్క రోజు కూడా ఆ సినిమా ఆడదని విడుదల చేసి కూడా వేస్ట్ అంటూ ఆయనకి చెప్పేసారని దాంతో తనకు చాలా భయమేసిందని చెప్పాడు అనిల్ రావిపూడి. కాకపోతే ఆ శాటిలైట్ ఛానెల్ ఓనర్‌ ని మాత్రం బూతులు తిట్టాలనేంత కోపం వచ్చిందని, అసలు  "నువ్వు అసలు క్రియేటర్ ఏంట్రా..? వారిలో క్రియేటివిటి నీలో ఎక్కడుందిరా అంటూ ఇష్టమొచ్చినట్లు ఫుట్ బాల్ ఆడుకోవాలని అనిపించిందని చెప్పాడు అనిల్ రావిపూడి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: