టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హిట్ ఫార్ములా కావడంతో చాలా మంది స్టార్ హీరోలు మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ కోణం చూస్తున్న హీరోలు ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఒక హీరో మరో హీరో నిర్మాతగా వ్యవహరించడం, ఒక హీరో తో మరో హీరో కలిసి నటించడం, ఒక హీరో మరో హీరోకి ప్రచారం చేయడం ఇలాంటివి ఎక్కువగా టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. 

 

ఈ ఫార్ములాను బాగా ఫాలో అవుతున్న హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరూ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది కూడా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ చేస్తుండగా, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ చేస్తున్నాడు. వీరి పాత్రల షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది అంటున్నారు. 

 

దీనితో వీరు ఇద్దరూ తర్వాతి సినిమా మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసే ఆలోచన చేస్తున్నాడట. ఎన్టీఆర్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమాకు నిర్మాతగా తాను వ్యవహరిస్తాను అంటున్నాడు రామ్ చరణ్. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: