టాలీవుడ్ లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తర్వాత పూజా హెగ్డే అంతగా సక్సెస్ సాధించలేదు. దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కానీ అక్కడ కూడా సక్సెస సాధించలేకపోయింది. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీతో మంచి విజయం అందుకున్న ఈ బ్యూటీ తర్వాత వరుస విజయాలు అందుకుంటుంది. సాధారణంగా తెలుగు, తమిళంలో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో బాలీవుడ్ లోకి జంప్ చేయడం తెలిసిన విషయమే. బాలీవుడ్ లో అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని హీరోయిన్లు భావిస్తుంటారు. అలాగే సౌత్ లో స్టార్స్ గా వెలుగుతున్నవారిని బాలీవుడ్ ఆహ్వానించి అందలం ఎక్కిస్తూంటుంది.
ఇప్పుడు పూజ పూజ హెడ్గే కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకుంది. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో మూవీలో నటించి వరుస విజయాలు అందుకుంది. అంతే కాదు ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ లో సల్మాన్ తో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో హృతిక్ రోషన్తో ‘మొహంజోదారో’.. అక్షయ్ కుమార్తో ‘హౌస్ఫుల్-4’లో నటించింది.
ఈ రెండు సినిమాలు పెద్దగా విజయం అందుకోలేదు. ఫర్హద్ సంజీ తెరకెక్కిస్తున్న మూవీలో సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానుంది. 2021 ఈద్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో పూజా హెగ్డే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ అమ్మడి దృష్టి బాలీవుడ్ పై పడటంతో టాలీవుడ్ లో కొంత ఇండస్ట్రీ పెద్దలు సిరియస్ అవుతున్నట్లు సమాచారం.