టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకున్న పూరి, ఆపై రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, సహా మరికొందరు నటులతో మంచి సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. వాస్తవానికి అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అతి పెద్ద సెన్సేషన్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. 

 

దానితో పూరి ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల కొన్నేళ్లుగా మాత్రం పూరికి ఆశించిన రేంజ్ లో విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇక గత ఏడాది రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళి హిట్ కొట్టిన పూరి, ప్రస్తుతం యువ నటుడు విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియా రేంజ్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు తో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఎంతో భారీగా రిలీజ్ చేయనున్నారు. అయితే పూరి, మొదట్లో రామ్ గోపాల్ వర్మ వద్ద పని చేయడం జరిగింది. 

 

తనకు దర్శకుడిగా వర్మ గారు ఇన్స్పిరేషన్ అని చెప్పే పూరి, ఆయన తనను దర్శకుడిగా ఎదగడానికి చాలా ప్రోత్సహించారు అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక ఇటీవల ఇస్మార్ట్ హిట్ తరువాత వర్మ గారు నన్ను మరింతగా ఎంకరేజ్ చేసారని చెప్పిన పూరి, తనను ఫ్లాప్స్ వచ్చిన టైం లో కూడా ఆయన ధైర్యం చెప్తూ ఉండేవారని అన్నారు. ఇకపోతే నేడు వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సంచలన మూవీ శివలో నాగార్జున వెనుక ఒక సీన్ లో పూరి నిలబడి ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వర్మ, ఇస్మార్ట్ పూరి అంటూ ఆ ఫోటోని పోస్ట్ చేసారు. కాసేపటికి వర్మ పెట్టిన ఫోటోని ట్యాగ్ చేసిన పూరి, అంతా మీ దయ అంటూ దానిని రీ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వర్మ పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: