ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ తో సినీ ఇండస్ట్రీ కుదేలు అవుతుంది. దాంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, బార్లు, మూసి వేస్తున్న విషయం తెలిసిందే.  స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేస్తున్నారు. అంతే కాదు స్వచ్ఛందంగా చిత్ర పరిశ్రలో వాళ్ళు సైతం తమ షూటింగ్ లను నిలిపివేస్తున్నారు. 10 లేదా 15 రోజుల తర్వాత తిరిగి షూటింగ్ చేయాలనుకుంటున్నారు. చిరంజీవి నటిస్తోన్న ఆచార్య షూటింగ్ ను నిలిపివేశారు. రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ విరామం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభాస్ నటిస్తున్న మూవీ షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతుందట. ప్రస్తుతం ప్రభాస్20 చిత్రం కోసం టీమ్ జార్జియాలో షూటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే.

 

కరోనా భయాల మధ్యే జార్జియా పయనమైన ప్రభాస్ అండ్ కో, ఆ వైరస్ వ్యాపిస్తున్నా కానీ లెక్క చేయకుండా షూటింగ్ ను కానిస్తున్నారు. మొన్ననే కరోనాకు భయపడకుండా హీరోయిన్ పూజ హెగ్డే జార్జియా వెళ్లిన విషయం తెల్సిందే.  తాజాగా ఇప్పుడు ఈ టీమ్ తో టాలీవుడ్ కమెడియన్ ప్రియ దర్శీ కూడా జాయిన్ అయ్యాడట. ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా పేజ్ లో కూడా పెట్టాడు. ఆ మద్య కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ప్రపంచం అంతా కరోనా వైరస్ తో భయపడుతంటే.. వీళ్లు మాత్రం ధైర్యంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.  

 

కాబట్టి కరోనా భయాల మధ్య కూడా డేర్ చేసి షూటింగ్ చేస్తున్నారు. నిన్ననే దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ తమ టీమ్ అవాంతరాలు ఎన్ని ఎదురైనా లెక్క చేయకుండా తమ టీమ్ షూటింగ్ చేస్తోందని గర్వంగా చెప్పుకున్నాడు. ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ ను కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు.  అయితే ఉగాదికి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: