టాలీవుడ్ కి ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత వచ్చిన వర్షం సినిమాతో హీరోగా పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఆపై ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలతో ముందుకు దూసుకెళ్లిన ప్రభాస్, అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇక అక్కడి నుండి మరింతగా ముందుకు సాగిన ప్రభాస్ కెరీర్ కి మిర్చి సినిమా మరింత బూస్ట్ ని ఇచ్చింది. ఇక ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాలూ కూడా ప్రభాస్ కు దేశ విదేశాల్లో కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడంతో పాటు బాలీవుడ్ హీరోల రేంజ్ స్టార్డం తో పాటు మార్కెట్ ని కూడా తెచ్చిపెట్టింది. 

 

ఇక ఇటీవల సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే మొదటి నుండి ప్రభాస్ మంచి భోజన ప్రియుడనే విషయం ఇప్పటికే పలువురు ఆయన తోటి నటులు చెప్పడం జరిగింది. ఇక ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా తన పర్సనల్ చెఫ్ లను ప్రభాస్ తన వెంట సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకువెళ్తారని, అలానే వారితో అక్కడ మంచి రకరకాల రుచులు వండించి సెట్స్ లోని వారందరికీ డైలీ మంచి విందు అందిస్తుంటారని కూడా మరికొందరు చెప్పారు. 

 

అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే మాత్రం, కడుపునిండా తినకుండా ఎవ్వరినీ ఆయన బయటకు రానివ్వరని, మరీ ముఖ్యంగా ఆయన ఇంట్లో వండే ఆహారపదార్ధాలు తినడం సంగతి తరువాత, అవి చూస్తేనే కడుపు నిండిపోతుందని ఇటీవల కొందరు నటులు చెప్పారు. మనం ఏదైనా పని మీద ఆయన ఇంటికి వెళితే, కడుపు నిండా భోజనం చేయాల్సిందే, లేదంటే చంపేస్తాను అని సరదాగా అంటుంటారట ప్రభాస్. ఇక ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కూడా అంతే అని, ఇంటికి ఎవరైనా వస్తే తృప్తిగా వారిని భోజనం చేయనిదే వెళ్లనివ్వరని కూడా వారు చెప్పడం జరిగింది. ఎంతైనా మన రెబల్ స్టార్స్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో మంచితనంలో కూడా రెబలే అని నిరూపించుకున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: