సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్. గత కొన్ని నెలల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నాబా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ లో అదరగొట్టింది. ఈసినిమా శాటిలైట్ , డిజిటల్  హక్కులను 10కోట్లకు జీ నెట్ వర్క్(జీ తెలుగు,జీ 5 ) దక్కించుకుందని సమాచారం.
 
అంతేకాదు  థియేట్రికల్ బిజినెస్ విషయం లోకూడా ఈ చిత్రం అదుర్స్ అనిపిస్తుంది. దాంతో సాయి ధరమ్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా సోలో బ్రతుకే సో బెటర్ రికార్డు సృష్టించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్  నిర్మిస్తున్నాడు. మే 1న విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత సాయి ధరమ్, ప్రస్థానం ఫేమ్ దేవాకట్టా తో తన తదుపరిచిత్రాన్ని చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంచ్ కూడా అయ్యింది.  సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈచిత్రంలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించనుండగా మణిశర్మ సంగీతం అందించనున్నాడు. భగవాన్, పుల్లారావు నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.
 
ఇదిలావుంటే వరసగా ఆరు పరాజయాల తరువాత సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు  గత ఏడాది  చిత్ర లహరి తో హిట్ కొట్టగా అదే ఏడాది చివర్లో  ప్రతి రోజు పండుగే తో బ్లాక్ బాస్టర్  విజయాన్ని అందుకున్నాడు. మరి ఇప్పుడు సోలో బ్రతుకే .. సాయి ధరమ్ కి హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: