మెగా క్యాంప్ లో అడుగుపెడితే చాలు హీరోయిన్ల కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని చెబుతారు. ఒకరి తర్వాత మరొకరు ఆఫర్లు ఇస్తూ..హీరోయిన్లకు మెగా బూస్ట్ ఇస్తుంటారు. ఇప్పుడు ఓ చెన్నై బ్యూటీకి కూడా ఇలాగే మెగా సపోర్ట్ దొరికింది. మెగా ఫ్యామిలీ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది. 

 

నివేథా పేరుతాజ్ మెగా హీరోయిన్ గా మారుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తూ, కెరీర్ ను తర్వాతి లెవల్ కు తీసుకెళ్తోంది. చిత్రలహరితో మెగా క్యాంపస్ లో అడుగుపెట్టిన నివేథా పేతురాజ్, ఇప్పుడీ కాంపౌండ్ లోనే మూడో సినిమా చేయబోతోంది.  

 

సాయితేజ్ చిత్రలహరి తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మెరిసింది. అయితే ఈ రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానే కనిపించింది నివేథా. అయితే సెకండ్ హీరోయిన్ రోల్ అయినా మెయిన్ హీరోయిన్ లెవల్ లో నటించిందని మెగా హీరోలు చాలా ఇంప్రెస్  అయ్యారట. అందుకే దేవకట్టా సినిమాలో నివేథాని మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నాడు సాయితేజ్. మరి మెగా ఫ్యామిలీ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న నివేథా కెరీర్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.


మెగా హీరోల పక్కన నటిస్తే వాళ్ల జీవితం ధన్యమైనట్టే అని సినీజనాల టాక్. అందుకే ఏ హీరోయిన్ అయినా మెగా ఫ్యామిలీ హీరోలతో నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఎప్పుడు.. ఎలా ఆ ఛాన్స్ దొరుకుంతా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఒక వేళ ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకుండా కరెక్ట్ గా సద్వినియోగం చేసుకునేందుకు చూస్తుంటారు. ఇలానే చెన్నై బ్యూటీ నివేథా థామస్ కు ఓ ఛాన్స్ వచ్చింది. అంతటితో ఆగిపోలేదు.  మెగా హీరోలతో ఆమె ప్రయాణం కొనసాగుతోంది.  ఒకటి కాదు రెండు కాదు మూడో సినిమాలో నటిస్తోంది. 



 

 

మరింత సమాచారం తెలుసుకోండి: