అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుందట. శేషాచలం అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది.

 

 


చిత్తూరు జిల్లా కథా ప్రాంతంగల ఈ సినిమాలో ఎక్కువ మంది నటులు కొత్తవాళ్ళే కనిపిస్తారట. ఆ ప్రాంత యాస మాట్లాడేవాళ్ళనే తీసుకున్నారని సమాచారం. అలు అర్జున్ కూడా ప్రత్యేకంగా ఈ యాసని నేర్చుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు అల్లు అర్జున్ ని ఏ సినిమాలోనూ చూడని విధంగా తన సినిమాలో సుకుమార్ చూపిస్తాడట. లారీ డ్రైవర్ గా కనిపించనున్న బన్నీ ఊరమాస్ లుక్ లో కనిపిస్తాడట.

 

 

ఇప్పటికే తన లుక్ కోసం టెస్ట్ జరుగుతుంది. హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయింది. అయితే ఒకానొక ముఖ్య పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. అందువల్ల ఈ సినిమాకోసం విజయ్ సేతుపతి వస్తాడనే ప్రచారం బాగా జోరుగా సాగుతోంది.

 

ఫారెస్ట్ ఆఫీసరుగా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడని సొషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. ఆ వార్తలన్ని ఒట్టి పుకార్లే అని చెబుతున్నారు. విజయ్ సేతుపతి గనక ఆ సినిమాలో నటిస్తే సినిమాకి మైలేజి మరింత పెరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి ఉండేవారని కారణాలు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ నిర్మిస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: