ప్రముఖ సినీనటుడు వైసిపి నేత తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ఛానల్ మాజీ చైర్మన్ బలిరెడ్డి పృధ్వీరాజ్ కేర్ ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్లి ఆ వెంటనే పాతాళంలోకి పడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి పార్టీ పెట్టినప్పటి నుంచి ముదిరాజ్ పార్టీ కోసం పని చేశారు ఇంకా చెప్పాలంటే జగన్ తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పటి నుంచే పృథ్వీరాజ్ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు.

 

గత ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా ఎన్నో ఆట పాటల ద్వారా ప్రజల్లోకి వచ్చి పోయారు జగన్ పాదయాత్ర లో సైతం ఆయన పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వైసిపికి బహిరంగంగా మద్దతు తెలిపిన మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పాలి. ఎన్నికల తర్వాత జగన్ సీఎం అయిన వెంటనే కీలకమైన ఎస్విబిసి భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు. అయితే కొద్ది కాలానికే ప్రతి రాజు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కు మధ్య తీవ్రమైన గ్యాప్ రావడంతో చివరకు పృథ్వీరాజు రాసలీలల ఆడియోటేపులు బయటకు రావడం ఆయన తన పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.


 తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృద్వి తనపై కుట్ర జగన్ వల్లే తన పదవి పోయిందన్న బాధను వ్యక్తం చేశారు. తను ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా ఉండగా ఒంగోలు వెళ్లానని అక్కడ పార్టీ ఆఫీస్ కి వెళ్లి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అని అప్పటి నుంచి తనను కొందరు టార్గెట్ చేశారని పృద్వి వాపోయారు. అయితే తనను ఎవరు టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పని పృద్వి ఒంగోలు తనపై కుట్ర జరిగిందని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని టార్గెట్ చేశారని అర్థమవుతోంది. ఇక తాను ఆ దేవుడి సాక్షిగా తప్పు చేయలేదని త్వరలోనే మళ్లీ పదవిలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: