చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి పూర్తిగా సినిమాలకే అంకితమైపోయాడు. తానెంతో ఇష్టంగా ఎంచుకున్న సినిమా రంగాన్ని వదిలి వెళ్ళినందుకు ఒక రకంగా కొంత బాధపడ్డాడట. ఈ విషయం చిరంజీవే స్వయంగా చాలా సార్లు చెప్పారు. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పునరుత్తేజం పొందినట్లు తెలిపాడు. అయితే చిరంజీవి ప్రస్తుతం చిన్న సినిమాలని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవ్వరు పిలిచినా వెళ్ళి ఆ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ ఇస్తూ వస్తున్నాడు.

 

మొన్నటికి మొన్న ఒక సంవత్సరం పాటు విడుదల వాయిదా పడిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు. అలాగే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా పరిచయం అయిన ఓ పిట్ట కథ ఫంక్షన్ కి వెళ్ళాడు. ఇలా చిన్నా పెద్దా తేడా అని తేడా లేకుండా తనని పిల్చిన ప్రతీ ఒక్కరి సినిమాకి వెళ్ళి వారి ప్రమోషన్లో భాగం అయ్యి వస్తున్నాడు. అలాగే చిన్న చిత్రాలని స్పెషల్ షోస్ వేసుకుని మరీ చూస్తున్నాడు.

\

తాజాగా చిరంజీవి నితిన్ నటించిన భీష్మ చిత్రాన్ని స్పెషల్ షో వేయించుకుని మరీ చూశడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రీసెంట్ గా విడుదల అయిన అన్ని చిత్రాలలో కెల్లా మంచి చిత్రంగా నిలిచి కలెక్షన్లు బాగా రాబట్టింది. ఈ సినిమా చూసిన చిరంజీవి దర్శకుడు వెంకీని, నితిన్ నటనని అభినందించారు. చిరంజివి తోపాటు దర్శకుడు వెంకీ కూడా ఉన్నాడు

 

ఈ సంధర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ చిరంజీవిగారితో కలిసి సినిమా చూడటం అనేది నా కల. అది ఈరోజు నిజమైంది. మా సినిమాను చూసి, అభినందించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈ సందర్భాన్ని జీవితం మొత్తం గుర్తుంచుకుంటాను అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: