ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది.  నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా చిత్రం డిజాస్టర్ తర్వాత అర్జున్ చాలా సమయం తీసుకున్నారు తన తదుపరి చిత్రం కోసం.. కారణం ఈసారి వస్తే బాక్సాఫీస్ హిట్ కొట్టాలనే ఆయన ఉద్దేశ్యం. అందుకే గతంలో తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ కే ప్రాదాన్యత ఇచ్చారు.  వీరిద్దరి కాంబినేషన్ లో మరో హ్యాట్రిక్ చిత్రంగా ‘అలా వైకుంఠపురములో’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  

 

సంక్రాంతి కానుగా గా మ్యూజికల్ హిట్ తో పాటు ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది.  ఈ చిత్రం హిట్ తర్వాత అల్లు అర్జున్ ఇక వరుస పెట్టి చిత్రాలకు కమిట్ అవుతున్నట్లు సమాచారం.   ఈనేపథ్యంలో ఆర్య, ఆర్య2 లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతుందట. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నారట. అయితే ఈ మూవీలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

 

 ఒక వైపున తమిళంలో వైవిధ్యభరితమైన కథానాయకుడిగా మంచి మార్కులు సంపాదించుకుంటూనే, మరో వైపున ఆయన తెలుగులో కీలకంగా నిలిచే విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'ఉప్పెన' సినిమాలో ప్రతినాయకుడి విలన్ గా నటిస్తున్నాడు.  కాకపోతే విజయ్ సేతు పతి ఉన్న విషయం పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.. అయితే ఈ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో , మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం కోసం బన్ని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: