ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు సాధించిన కుర్రహీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ పక్కన అర్జున్ సురవరం సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకని మంచి విజయాన్ని తన సొంతం చేసుకుంది. అందాల రాక్షసి లాంటీ డీ గ్లామరస్ రోల్ చేసిన డిల్లీ ముద్దుగుమ్మ తరువాత  నిదానంగా తన అందాలను యూత్ కి ఎరగా వేయడం ప్రారంభించింది. అటుపై పదిమంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే తమిళంలో ఛాన్స్ ని అందుకుంది. అధర్వ సరసన అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

 

కాగా ఇప్పుడు డైరెక్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం ముద్దుగుమ్మ అందుకొంది. పాలిటిక్స్ నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో పింక్ సినిమాకు రీమేక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉంటుందట. అందులో అమ్మాయిగా శృతి హాసన్ ని అనుకుంటున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి.

 

అయితే ఇప్పుడు రెండో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. వచ్చే వేసవిలో సినిమా రిలీజ్ కానుందిప్రస్తుతం లావణ్య ప్రస్తుతం తెలుగులో `1 ఎక్స్ ప్రెస్` సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా నటిస్తోంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: