ఏ మాటకు ఆ మాట టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోల హవా కొనసాగుతుంది అనే మాట వాస్తవం. ప్రస్తుతం సీనియర్ హీరోలుగా ఉన్న మహేష్, ప్రభాస్ సహా మరికొందరు ఉన్నారు. వీళ్ళు వచ్చి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అయితే కొన్ని రోజులుగా వీరి క్రేజ్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా మహేష్ బాబు క్రేజ్ పడిపోతుంది. ఆయనకు గ్లామర్ ఉన్నా సరే సినిమా విజయాలు మాత్రం సరిగా రావడం లేదు. ఆశించిన స్థాయిలో హిట్ రేట్ అనేది మహేష్ బాబుకి లేదు అనే చెప్పాలి. భరత్ అను నేను, మహర్షి సినిమాల తర్వాత చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ అయింది. 

 

సినిమా వసూళ్లు సాధించి ఉండవచ్చు గాని, అది ఫ్లాప్ అయింది. మౌత్ పబ్లిసిటీ ఎక్కువగానే ఈ సినిమాకు మైనస్ అయింది అనేది వాస్తవం. ప్రస్తుతం అతను ఎవరితో సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు. వంశీ పైడపల్లి దర్శకత్వంలో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మహేష్ బాబు క్రేజ్ మరింతగా పడిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటో తెలియదు గాని చాలా మంది నిర్మాతలు మహేష్ బాబుతో సినిమా అనగానే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఈ మధ్య కాలంలో. 

 

ఇక ప్రభాస్ తో భారీగా పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది టాలీవుడ్ లో. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అతను మరో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. వీళ్ళ క్రేజ్ తగ్గుతుంది అని భావించిన నిర్మాతలు వాళ్లకు పెట్టుబడి పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. మరికొందరు హీరోల విషయంలో కూడా నిర్మాతలు ఇలాగే ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: