టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు అనగానే అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అలాగే ప్రభాస్ సినిమాల కోసం బాలీవుడ్ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమాలకు కూడా క్రమంగా క్రేజ్ పెరుగుతుంది. దీనితో వీరి సినిమాలకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్తకు ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు. 

 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అతను ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఆ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తి కాగానే అతను ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది. విలన్ గా ఒక స్టార్ హీరో ని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. 

 

అతను ఎవరో కాదు గోపి చంద్ అంటున్నారు. గోపి చంద్ సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసే సమయానికి గోపి చంద్ కూడా ఆ సినిమా పూర్తి చేసుకుని ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అతను కూడా ఒక రాజకీయ నాయకుడు అని ఈ సినిమాలో అలాంటి పాత్రే అతని కోసం రెడీ చేస్తారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ప్రచారం మాత్రం అభిమానులలో మరింత ఆసక్తిని పెంచుతుంది అనే మాట వాస్తవం. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: