ఈ ఉగాదికి జనాలంతా స్మాల్ స్క్రీన్ పై వచ్చే షోలు ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే కరోనా వల్ల థియేటర్స్ బంద్ చేయించారు కాబట్టి ఇక జనాలు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇక రానున్న ఉగాది రోజు మామూలుగానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో అలరించే ఈటివి పండుగ సార్ పండుగ అంతే అంటూ ఒక షో చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమో యూట్యూబ్ లో హంగామా చేస్తుంది. సుధీర్, ఆది, శేఖర్ మాస్టర్, రోజా, శ్రీముఖి ఇలా అందరు షోలో పాల్గొన్నారు. ఇక దీనికి పోటీగా ఏమాత్రం తగ్గకుండా ఉండేలా జీ తెలుగు షో ప్లాం చేసింది. 

 

అదిరింది షోతో జబర్దస్త్ కు గట్టి పోటీ ఇద్దామని చూస్తున్న జీ టివి అదిరింది టీమ్ తో పాటుగా స్టార్ సెలబ్రిటీస్ ను వాడేస్తున్నారు. ఉగాది సందర్భంగా జీ తెలుగులో బాబు గారింట్లో బుట్ట భోజనం అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ షో ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఉగాది రోజు ఈటివి, జీ తెలుగు టివిల మధ్య టిఆర్పి యుద్ధం జరిగేలా ఉంది. జీ తెలుగులో షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా స్వీటీ అనుష్క స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. అదిరింది షో కోసం ఈటివి ని వదిలి జీ తెలుగు వెళ్లిన నాగబాబు ఆ ఛానెల్ ను నిలబెట్టేందుకు బాగానే కృషి చేస్తున్నట్టు అనిపిస్తుంది. 

 

పండుగ వస్తే బుల్లితెర ఆడియెన్స్ ను అలరించే ఈ షోలు ఎన్ని చేసినా అవన్నీ సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. ఈటీవీలో అందరు తెలిసిన వారు చేసే హంగామా ఉంటుండగా.. జీ తెలుగులో స్టార్స్ తో అంటా సందడి సందడిగా ఉండబోతుంది. మరి ఉగాది రోజు పోటీ పడుతున్న ఈ షోలలో ఏది సూపర్ అనిపించుకుంటుందో చూడాలి. ఓ పక్క నాగబాబు ఒక్కడే జీ తెలుగులో హోస్ట్ గా స్టార్ క్రేజ్ తీస్తుండగా ఈటీవీలో మాత్రం రోజా, శేఖర్ మాస్టర్, ఆది, సుధీర్ అందరు షో కోసం తెగ రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. మరి ఈ రెండు షోలు సక్సెస్ అయితే ఆడియెన్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: