భాష ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా సినిమా ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి తమకు మాత్రమే తెలిసిన రహస్యాలు కొన్ని ఉంటాయి. ప్రొఫెషనల్ గా వారు తమ విషయాలన్నింటిని అనవసరంగా ఓపెన్ చేయకుండా సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ను కొన్నేళ్ళు టాప్ హీరోయిన్ గా ఏలిన కరీనా కపూర్ కి మాత్రం ప్రతి ఒక్కరి గురించి ఇట్టే తెలిసిపోతుందట.

 

మధ్యనే ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టిన కరీనాకపూర్ మొన్న బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ మరియు  రెక్టర్ రోహిత్ శెట్టి తో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షో కు వచ్చింది. అయితే మీరు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో అక్షయ్ కుమార్ పోలీసు వారు ఖచ్చితంగా కరీనాను వారి డిపార్ట్మెంట్ లో చేసుకోవాలని.. ఆమె వారికి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అని చెప్పగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మరియు రోహిత్ శెట్టి లకు విషయం అర్థమైపోయింది.

 

వెంటనే రోహిత్ శెట్టి అందుకుంటూ అవును కరీనాకు టాలెంట్ ఉంది. ఒక రోజు రాత్రి నేను చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా కోసం షారుక్ ఖాన్ ను కలిసేందుకు వెళ్లగా విషయం నాకు, షారుక్ కు తప్ప ఎవరికీ తెలియదు. కానీ పక్క రోజు ఉదయాన్నే బెబో అలియాస్ కరీనా రోహిత్ శెట్టి దగ్గరికి వచ్చి ఏంటి రాత్రి షారుక్ తో ఉన్నావా అని నేరుగా అడిగేసిందట. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్ వంతయింది. ఇకపోతే అప్పుడు కరణ్ జోహార్ కరీనా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చి తన ఇంట్లో నుండి గమనిస్తూ ఉంటుందని చమత్కారం చేశాడు. అంతే కాకుండా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అంతెందుకు మన దేశంలోనే కరీనా నాకు తెలియకుండా ఏమీ జరగదని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: