బాలీవుడ్‌ ఫిలిం ఇండస్ట్రీలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన జూహి చావ్లా చాలా సినిమాల్లో బడా హీరోల సరసన నటించి మంచి పేరుని సంపాదించింది. ఐతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ ఇంటర్వ్యూలో జుహీ చావ్లా 1993లో నటించిన లూటేరే సినిమాలోని పాటల గురించి కూడా ప్రస్తావన వచ్చింది.

 

 

ముఖ్యంగా లూటేరే మూవీలో 'మెయిన్ తేరి రాణి తు రాజా మేరా' అనే సాంగ్ లో జుహీ చావ్లా బీచ్ లో చూపించిన అందాల ఆరబోతను ఏ బాలీవుడ్ ప్రేక్షకుడు మరచిపోలేడు. ఈ పాట విడుదలై దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ... ఇప్పటికీ ఈ పాటని వినేవారు లక్షల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అంతలా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఈ పాటలో జుహీ చావ్లా నటించేందుకు అభ్యంతరం తెలిపిందట. దానికి కారణమేంటో తాజాగా ఆమె బయటపెట్టింది.



సినిమా విమర్శకుడు రాజీవ్ మసంద్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జుహీ చావ్లా మాట్లాడుతూ... 'నేను నటించిన 'ఖయామత్ సే ఖయామత తక్' మూవీ అప్పటికే పెద్ద హిట్ అయ్యి నాకు బాగా పాపులారిటీ తెచ్చింది. ఆ తర్వాత 'లవ్ లవ్ లవ్' షూటింగ్ జరుగుతుంది అనుకుంటా. అప్పుడే నేనేదో పెద్ద స్టార్ అయిపోయినట్లు, నా బాడీ లో మార్పు వచ్చినట్టు నాకు అనిపించింది.

 

 

'ఆ సమయంలోనే దర్శకుడు ధర్మేష్ దర్శన్ ఊహలలో నేను పడిపోయాను. దాని కారణంగానే నాకు తన లూటేరే చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రంలోని 'మెయిన్ తేరి రాణి తు రాజా మేరా' అనే సాంగ్ లో నేను చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేనేంటి? కేవలం ఒక్క షర్ట్ వేసుకుని... కింద అస్సలు ఏం వేసుకోకుండా బీచ్ మీద డ్యాన్స్ చేయడం ఏంటి? అని అనుకున్నాను. కానీ ఆ పాటలో నా సౌందర్యం చూపించడం చాలా అవసరం. ఏది ఏమైనా ఆ పాటకి సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే తనకి శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాంటి హీరోయిన్లతో చేసిన అనుభవం ఉంది. అందుకే ఆ పాటలో మొదటగా ఇబ్బంది పడినా తర్వాత ధైర్యంగా నటించేశాను.' అని చెప్పింది.



ఇకపోతే ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరో గా నటించగా... బీచ్ పాటని అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ పాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: