ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది డైరెక్టర్లు తన సత్తా చాటుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు . కానీ అందరూ మేల్ డైరెక్టర్ లే. మహిళా డైరెక్టర్ లు  మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఉన్నా తమ సత్తా చాటుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మిగతా డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న మహిళా దర్శకురాళ్లు  మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. ఇక అటు ప్రేక్షకులు  కూడా ఎక్కువగా మహిళా డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఎవరు అంతగా తెరమీదికి రాలేదు. ఇలా లేడీ డైరెక్టర్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు సాగుతున్న సమయంలో ఒక లేడీ డైరెక్టర్ తెర మీదికి వచ్చి మహిళలు ఎక్కడ తక్కువ కాదు అని మరోసారి నిరూపించింది. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్లో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకుని స్టార్  డైరెక్టర్లకు సైతం పోటీనిస్తోంది. ప్రస్తుతం ఆ మహిళా డైరెక్టర్ ఏదైనా  సినిమాను తెరకెక్కించింది అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అని సినీ ప్రేక్షకులు సైతం భావించే విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ముద్ర వేసుకుంది ఆ మహిళా దర్శకురాలు. ఇంతకీ ఆ మహిళా దర్శకురాలు ఎవరో  మీకు అర్థమయ్యే ఉంటుంది . ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లకు సైతం పోటీ ఇస్తూ  మహిళా శక్తిని చాటుతున్న దర్శకురాలు నందిని రెడ్డి. మొదటినుంచి ప్రేక్షకుల్లో మంచి నమ్మకాన్ని ఏర్పర్చింది ఈ దర్శకురాలు. నందిని రెడ్డి తెరకెక్కించిన మొదటి సినిమా అలా మొదలైంది... చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి  సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమా. ఇక ఆ తర్వాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన కళ్యాణ వైభోగమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి  మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత తో లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన... కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ఓ బేబీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి సత్తా చాటింది నందిని రెడ్డి. ఇలా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ మహిళా దర్శకురాలు. ప్రస్తుతం ఇతర దర్శకులకు  సైతం పోటీ నిస్తూ మహిళా శక్తిని తెలుగు చిత్ర పరిశ్రమలో చాటి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: