కరోనా వల్ల ప్రస్తుతం నిర్మాణం లో వున్న అన్ని సినిమాల షూటింగ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆప్రభావం విడుదల తేది లపై పడింది ఏకంగా మూడు వారాలు షూటింగ్ లు రద్దు కావడం తో అనుకున్న టైం కి సినిమా పూర్తి చేయలేరు కాబట్టి  దాదాపు అన్ని సినిమాల విడుదల వాయిదా పడ్డట్లే  అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ ఒకటి.  సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి శరవేగంగా  చిత్రీకరణ జరుపుకుంటుండగా ఇప్పుడు  కరోనా వల్ల  బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
 
దాంతో ప్రస్తుతం జరగాల్సిన ముఖ్యమైన షెడ్యూల్ నిలిచిపోయింది. దీనివల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో మేలో విడుదకావాల్సిన ఈ చిత్రం జూన్ లో రానుందని సమాచారం.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు  లావణ్య త్రిపాఠి ని కూడా ఓ కీలక పాత్ర ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అలాగే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఉగాది కి మేకర్స్,  టీజర్ విడుదల చేసే ఆలోచనలో వున్నారట.   
 
ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తో  పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ను పెట్టనున్నారని సమాచారం. సుమారు 150కోట్ల బడ్జెట్ తో మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: