ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా టాలీవుడ్ లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. తొలుత ఈ ఏడాది మే లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెప్పింది. మళ్ళీ దాన్ని జూన్ నెలకు మార్చారు. ఆ తర్వాత మళ్ళీ దసరాకు అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ మారింది. సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. 

 

ఇప్పుడు ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడితే విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే వాయిదా పడితే పడింది ఒక టీజర్ అయినా విడుదల చేసే ప్రయత్నం అయినా చేయవచ్చు కదా అంటున్నారు. ఒక్క ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు రాజమౌళి. దీనితో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇలా ఎంత కాలం ఎదురు చూసే విధంగా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా గురించి ఇన్ని రోజులు ఎదురు చూసేలా చేయించడం హీరోలను మరో సినిమా చేయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతున్నారు. ఈ విధానం మంచి పద్ధతి కాదని దర్శకుడి తీరుని తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: