ప్రపంచ‌మంతా ఓ ప‌క్క క‌రోనాతో అల్ల‌కల్లోల‌మ‌యిపోతుంతే. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మాత్రం చాలా కూల్‌గా త‌న ప‌ని తాను చేసుకునివెళుతున్నాడు. రాధాకృష్ణ‌ద‌ర్శ‌క‌త్వంలో జాన్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆయ‌న ఎక్క‌డా బ్రేక్ ఇవ్వ‌కుండా మాస్క్‌లు ధ‌రించి మ‌రి దేశాలు దాటి షూటింగ్ చేస్తున్న ప్ర‌భాస్ ఘ‌ట్స్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంత మంది ఫిదా అవుతుంటే మ‌రి కొంత మంది భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. అంతేకాక కొంద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లైతే స‌ల‌హాలు సూచ‌న‌లు కూడా ఇచ్చేస్తున్నారు. మ‌రి వాటిని ప్ర‌భాస్ ఎంత వ‌ర‌కు ప‌ట్టించుకుంటారు అన్న విష‌యం ప‌క్క‌న పెడితే...

 

దాదాపు ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌లె ఆక్క‌డ ఓ ఛేజింగ్ సీక్వెన్స్‌ని సైతం విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఈ మ‌ధ్య‌నే పూజా హెగ్డే కూడా ఆ షూటింగ్‌లో పాల్గొన్నారు. మ‌రో వారం ప‌దిరోజులు అక్క‌డే ఉండాల్సి వ‌స్తుందట‌. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్ర‌భాస్ తిరిగి ఇండియాకి రానున్నారు. చిత్ర యూనిట్ మాత్రం ఎక్క‌డా బ్రేకివ్వ‌కుండా సినిమాను శ‌ర‌వేగంగా తెర‌కెక్కిస్తోంది. అలాగే విపత్కర పరిస్థితులలో షూటింగ్ కి సంహరించిన జార్జియా టీమ్ కి కృతజ్ఞతలు అని డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అలాగే త్వరలో మూవీ నుండి ఫస్ట్ లుక్ రానుందని ఆయన హింట్ కూడా ఇచ్చారు. ఐతే మరో కొద్దిరోజులలో ఉగాది పండుగ సంద‌ర్భంగా ఈ నేపథ్యంలో చిత్రంలోని ప్రభాస్ లుక్ విడుదల చేసే అవకాశం కలదు. కాబట్టి ఉగాది రోజున ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసే సూచనలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. 

 

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో ప్రభాస్ కి జంటగా మొదటిసారి పూజ హెగ్డే నటిస్తుంది. అలాగే ఈ చిత్రంతో పాటు పూజా మ‌రో సినిమాల‌కు సైన్ చేసింది. ప్ర‌స్తుతం ఆమె హ‌వా టాలీవుడ్‌లో బాగా గ‌ట్టిగానే ఉంద‌ని చెప్పాలి. సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర ద‌ర్శ‌కుడు ఈ చిత్ర అప్‌డేట్‌ని ఇచ్చారు. మ‌రి వీళ్ళ ఘ‌ట్స్‌కి హాట్సాఫ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: