మెగాస్టార్ చిరంజీవి వరుస సక్సెస్ లతో ఉన్నా ఆయన సినిమాలకు ఏదొక అవాంతరం వస్తూనే ఉంది. చిరంజీవి లాంటి సూపర్ స్టార్ కి రాకూడని సమస్యలు రావడం నిజంగా విచిత్రమే. రాజకీయాల నుంచి వచ్చి చేస్తున్న ప్రతి సినిమాకు ఆయనకు హీరోయిన్ సమస్య రావడం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సినిమాకు కన్ఫర్మ్ అయిపోయింది త్రిష. కానీ.. మరో వారంలో షూటింగ్ అనగా త్రిష ఇచ్చిన షాక్ కు యూనిట్ పెద్ద తలనొప్పి ఎదురైంది. మరోవైపు స్పెషల్ క్యారెక్టర్ లో మహేశ్ చేస్తాడో లేదో తెలీని పరిస్థితి.

 

 

ఈ పరిస్థితులు మెగాస్టార్ కు చికాకు తెప్పించేవే అని చెప్పాలి. కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వ నిర్ణయానికి మద్ధతిస్తూ తన సినిమాను తానే వాయిదా వేసుకుని ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. తర్వాత మొత్తం పరిశ్రమే షూటింగులను నిలిపేసింది. ఈ సమయం ఇప్పుడు మెగాస్టార్ కు ఉపయోగపడేదే. రెగ్యులర్ షూటింగ్ ఉంటే షెడ్యూల్ దగ్గరపడుతోంది.. ఈ సమస్యలు తేలేదెలా అని తల పట్టుకుని కూర్చోవాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల చిరంజీవికి ఈ నెలాఖరు వరకూ టైమ్ దొరికినట్టైంది. ఈ టైమ్ లో హీరోయిన్ తో పాటు, స్పెషల్ క్యారెక్టర్ ఎవరితో చేయించాలో చిరంజీవి నిర్ణయించుకునేందుకు అవకాశం చిక్కింది.

 

 

హీరోయిన్ గా కాజల్, అనుష్క్ పేర్లు వినిపిస్తున్నాయి. అనుష్క ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్పెషల్ రోల్ లో మహేశ్ పక్కా అని.. కాదు తప్పుకున్నాడని మరో పక్కా వార్తలు రౌండ్ అవుతున్నాయి. మహేశ్ కాని పక్షంలో చరణ్ తో చేయించాలని భావిస్తున్నారు. కానీ రాజమౌళి కమిట్ మెంట్ అడ్డువస్తోందట. దీనికి రాజమౌళి యాక్సెప్టెన్స్ కావాల్సిందే. మరి.. ఈ రెండు వారాల్లో చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరించుకుంటే సినిమాను ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: