పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ సినిమాలు చేయనని ప్రకటించిన తర్వాత తన పార్టీ ఆర్థిక పుష్టి కోసం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం ఆయన మళ్లీ సినిమాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడవచ్చని ఖుషీ అయ్యారు.

 

తర్వాత పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ నేషనల్ అవార్డు సినిమా 'పింక్' రీమేక్ గా 'వకీల్ సాబ్' షూటింగ్ మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు చిత్రానికి హీరోయిన్ వెతకడం చాలా కష్టతరంగా మారింది. ముందు నయనతార, త్రిష వంటి ఎంతోమంది అనుకున్నా ఎవరు సినిమాలో హీరోయిన్ పాత్ర వేయడానికి సముఖంగా లేరని తెలుస్తోంది. తాజాగా లావణ్య త్రిపాటి ఒక పాత్రకి ఓకే అయిన తర్వాత పవన్ కి జంటగా అనుష్క కూడా నటించడానికి తిరస్కరించిందట. అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మరియు అనుష్క కాంబినేషన్ లో సినిమా రాలేదు.

 

ఇదిలా ఉండగా ఇటీవల కరోనా వైరస్ సందర్భంగా అన్ని సినిమా షూటింగులు మరియు సినిమాలు ఆపేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం రన్నింగ్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న వాళ్లు డైలమాలో పడ్డారు. ముఖ్యంగావకీల్‌ సాబ్‌సినిమాని మే నెలలో విడుదల చేయాలని భావించిన తరుణంలో తాజా పరిస్థితుల బట్టి షూటింగ్ ఆగిపోయే పరిస్థితులు నెలకొనడంతో సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవ్వదని ఇండస్ట్రీలో టాక్.

 

దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేయడం, తర్వాత అతి త్వరలోనే మే నెలలోనే సినిమా రిలీజ్ అవుతుంది అని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులకు వార్త బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: