తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ప్రస్తుతం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనుకునేంతగా ఎదిగాడు మహేష్ బాబు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా దూసుకుపోతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతూ... బాక్సాఫీస్ ను  షేక్ చేస్తున్నాడు మహేష్ బాబు. కేవలం సినిమాల్లో నటించిన కాదు సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించి  నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 

 

 

 ఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్  నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. అయితే ఇప్పుడు వరకు మహేష్ బాబు నటించిన సినిమాలకు  నిర్మాతగా భాగస్వామి గా ఉంటూనే ఇతర సినిమాల నిర్మాణానికి కూడా తన నిర్మాణ సంస్థలో చేపడుతున్నారు. ఓవైపు సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతునే...  మరోవైపు సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సహకారంతో అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఎంబి  ప్రొడక్షన్ కు సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు  ఇంకొన్ని రోజుల్లో వెబ్ సిరీస్ లను కూడా నిర్మించబోతున్నారు అని సమాచారం. ప్రముఖ దర్శకుడు దేవాకట్ట అమెజాన్ ప్రైమ్ సహకారంతో... ఒక పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నారు అనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. అయితే ప్రతిభావంతుడైన డైరెక్టర్ దేవకట్టా ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని... కొన్ని రోజుల్లో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ప్రస్తుతం దేవాకట్ట తేజ్ సినిమా పూర్తి కాగానే ఈ వెబ్ సిరీస్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారట. తమ ఫేవరేట్ హీరో మహేష్ బాబు నిర్మాతగా సినిమా రంగంలోనే కాదు డిజిటల్ రంగం లోకి కూడా అడుగు పెడుతుండడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: