ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ యువతలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా మాత్రం చాలా తక్కువ ఉన్నారు అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో యూత్ లో మంచి పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు... మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాతో నభా నటేష్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్... ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో  చాందిని పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. చాందిని పాత్రలో ఈ అమ్మడు నటించింది అనేకంటే ఇరగదీసింది అనే చెప్పొచ్చు. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ... తన అందంతో మెస్మరైజ్ చేస్తూ... తెలుగు ప్రేక్షకులు అందరిని బుట్టలో వేసుకకుంది  ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఏకంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎనర్జిని  మ్యాచ్ చేస్తూ ఈ అమ్మడు అద్భుతమైన నటనతో అందచందాలతో అదరకొట్టింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్లో ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో కూడా నటించింది నభా నటేష్. ఇక ఈ సినిమా ఊహించినంత  ప్రేక్షకాదరణ పొందక పోవడంతో... ఈ అమ్మడుకు ఈ సినిమా అంతగా కలిసి రాలేదు. ఇక ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో సినిమాలో  యువ హీరోతో రొమాన్స్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు

 

 

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే కరోనా  వైరస్ కారణంగా నటులు  ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అన్ని సినిమా యూనిట్ లు తమ చిత్రీకరణను  కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవాలని అంటూ  నిర్మాతల మండలి సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. కానీ  అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ మాత్రం నిర్మాతలు వాయిదా పడనట్లు తెలుస్తోంది. దీనికి కారణం నిర్మాత బెల్లంకొండ సురేష్ అల్లుడు అదుర్స్ చిత్ర యూనిట్ తో మాట్లాడి  షూటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పారట. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నభా నటేష్ కూడా చిత్రీకరణ లో పాల్గొనాలని హైదరాబాదుకు రమ్మన్నారట . ఇక కరోనా  నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: