సినీ ప్ర‌పంచంలో ప్రేమ‌లు, పెళ్ళిళ్ళు  ఆరునెల‌లు ఏడాది గ‌డ‌వ‌క ముందే విడిపోవ‌డం లాంటివి మ‌నం వింటూనే ఉంటాం. డైరెక్ట‌ర్లు హీరోయిన్ల వ‌ల‌లో ప‌డి భార్య‌ల‌ను వ‌దిలేయ‌డం. అలాగే హీరోలు కూడా త‌మ భార్య‌ల‌ను వ‌దిలేసి హీరోయిన్ల వెంట ప‌డ‌డం అనేది చాలా స‌హ‌జం. అయితే ఇదే కోవ‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు. తాము ప్రేమించిన వారినిపెళ్ళి చేసుకోవ‌డం కోసం భ‌ర్త‌ల‌ను సైతం స‌తాయించిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వ‌న్నీ సినీ హీరోయిన్ల‌లో ఎన్ని జ‌రుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డ‌లేదు. అయితే ఇలాంటి వారు ఎవ‌రు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవ‌ల‌సింది కావ్య మాధ‌వ‌న్ దాదాపు 75 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. కానీ నిజ జీవితంలో మాత్రం ఫెయిల‌యింది. చిన్న‌ప్ప‌టి నుంచి ఎక్కువ‌గా సినిమాల్లో న‌టించ‌డం వ‌ల్ల సినిమా రాజ‌కియాల‌ను బాగా వంట ప‌ట్టించుకుంది ఈ భామ‌. అంతేకాక వాటిని అమ‌లు కూడా చేసింది. హీరో దిలీప్ స‌ర‌స‌న ఎక్కువ‌గా సినిమాల్లో న‌టించింది. వీరిద్ద‌రు క‌లిసి ఎక్కువ‌గా రొమాంటిక్ సినిమాల్లో న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. కానీ అప్పటికీ దిలీప్ చంద్ర‌కి వివాహం జ‌రిగింది. ఇక ఇంట్లో వారి బ‌ల‌వంతం మీద ఒక మ‌ల‌యాళి నిశ్చ‌ల్‌ని వివాహం చేసుకుంది. కానీ ఎక్కువ‌రోజులు ఉండ‌లేక త‌ర‌చు అత‌నితో గొడ‌వ ప‌డేది. ఆఖ‌రికి విడాకులు అడిగితే నిశ్చ‌ల్ కుద‌ర‌దు అన‌డంతో ఇక రంగంలోకి దిలీప్ చంద్ర‌ని దింపింది. ఇద్ద‌రు క‌లిసి నిశ్చ‌ల్‌ని టార్చ‌ర్ పెట్ట‌డం మొద‌లుపెట్టారు. చివ‌రికి విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత దిలీప్ కూడా త‌న భార్య నుంచి విడాకులు తీసుకుని ఇద్ద‌రు వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ న‌టి భావ‌న కిడ్నాప్ కేసులో వీరిద్ద‌రూ ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు. ఇక విల‌నిజానికి మారుపేరుగా మారింది కావ్య వ్య‌వ‌హారం.

 

ఇక బాలీవుడ్ న‌టి రేఖ ఈమె హీరోయిన్ గా చేస్తున్న‌ప్పుడు ఎక్కువ సినిమాలు అమితాబ్‌తో క‌లిసి న‌టించింది. అమితాబ్‌తో ప్రేమ‌లో ఉండ‌డం వ‌ల్లే రేఖ త‌న భ‌ర్త తో స‌రిగా కాపురం చేసేది కాద‌ని భ‌ర్త‌ని టార్చ‌ర్ పెట్టేద‌ట‌. దాంతో అత‌ను త‌ట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడ‌న్న మాట‌లు కూడా వినిపించాయి. అయితే రేఖ మాత్రం భ‌ర్త లేక‌పోయిన కుంకుమ , పూలు పెట్టుకుంట‌ది. అంటే అమితాబ్ మీద త‌న‌కున్న పిచ్చి ప్రేమ అమితాబ్‌ను భ‌ర్త‌లా భావించేలా చేస్తుంది.

 

ఇక న‌టి వినిత విజ‌య్‌కుమార్ ఈమె మంజుల‌, విజ‌య్‌కుమార్‌ల గారాల ప‌ట్టి. వినీత పై కోలీవుడ్‌లో లెక్క‌లేన‌ని మాట‌లు వ‌చ్చాయి. తెలుగులో దేవి చిత్రంతో బాగా పాపుల‌ర్ అయింది వినీత‌. త‌న సోద‌రితో ఎఫైర్ పెట్టుకున్నాడ‌ని తండ్రి ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ త‌మ్ముడిని చంపించింద‌ని మొద‌ట ఆమె పై కేసు న‌మోదు అయింది. ఆ త‌ర్వాత ఆకాష్ అనే టివిన‌టుడితో సంబంధం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి మ‌రి పెళ్ళి చేసుకుంది. ఆ త‌ర్వాత ఆనంద్‌రాజ్ అనే సంప‌న్నుడిని బుట్ట‌లోకి దింపి మొద‌టి భ‌ర్త‌ను వ‌దిలించుకుంది. అయితే మొదటి భ‌ర్త‌తో ఒక కొడుకు, రెండ‌వ భ‌ర్త‌తో ఒక కూతురు ఉన్న వినీత ప్ర‌స్తుతం ఒక కొరియో గ్రాఫ‌ర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తూ విడిపోయిన భ‌ర్త‌ల ఆస్తుల కోసం కేసులు పెట్టి వేధిస్తోంది. ఇది మాత్ర‌మే కాక త‌న కొడుకును భ‌ర్త కిడ్నాప్ చేశాడంటూ అత‌ని పై కేసు పెడితే కూతుర్ని వినీత కిడ్నాప్ చేసిందంటూ రెండ‌వ భ‌ర్త ఆమె పై కేసు పెట్టాడు. 

 

ఆ త‌ర్వాత న‌టి రాధిక ఈమె కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. ప్ర‌తాప్ పోత‌న్ ఇత‌ను ఆర్డిన‌రీ యాక్ట‌ర్ రాధిక ఇత‌న్ని ముందు ప్రేమించింది కాబ‌ట్టి రాధిక‌ను అత‌ను ప్రేమించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప్ర‌తాప్‌ని వివాహం చేసుకుని అత‌నికి టార్చ‌ర్ మొద‌లు పెట్టింది. ఆత్మ‌గౌరవం ఉన్న ఏ మ‌గాడు రాధిక‌తో కాపురం చెయ్య‌డ‌ని చెప్పేసి విడాకులు తీసుకున్నాడు అయినా కూడా రాధిక అత‌న్ని వ‌ద‌ల్లేదు. ప్ర‌తాప్ త‌ర్వాత ఒక ఫారెన‌ర్‌ని వివాహం చేసుకుంది రాధిక‌. ఆ త‌ర్వాత శ‌ర‌త్‌కుమార్‌ని వివాహం చేసుకుని ఇప్ప‌టికి లైఫ్‌లో సెటిల్ అయింది. 

 

ఎంతో అందంగా క‌నిపించే సీత దాదాపు అన్ని భాష‌ల్లో న‌టించింది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. కోలివుడ్ న‌టుడు పార్ధివ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్ద‌రు కుమార్తులు, ఒక ద‌త్త పుత్రుడు ఉన్నారు. చిన్న చిన్న విభేదాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత త‌న కోఆర్టిస్ట్ స‌తీష్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే కొన్ని రోజుల‌కే అత‌నితో విభేదాలు రావ‌డంతో విడాకులు తీసుకోక‌త‌ప్ప‌లేదు. ఇలా రెండు వివాహాలు విచ్చిన్నం కావ‌డంతో తీవ్ర డిప్ర‌ష‌న్‌కి వెళ్ళిన సీత‌కు న‌టిగా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో సీత పొట్ట‌కూటికోసం అడ్డ‌దారులు తొక్కిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. చెన్నైలో ఆమె కొన్ని వ్య‌భిచార గృహాలు న‌డిపిన‌ట్లు సీత ఇంటికి వ‌చ్చేవార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: