మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కియారా అద్వాని జంటగా నటించిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాలో చరణ్ కియార జంట మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే వినయ విధేయ రామ మెగా ఫ్యాన్స్ కి భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. అంతేకాదు ప్రేక్షకులు చాలా డిసప్పాయింట్ అయ్యారు.

 

అయితే సినిమా విషయం పక్కన పెడితే మళ్ళీ మళ్ళీ చరణ్ కియారా లను చూడాలని అందరూ అనుకున్నారు. కాని ఆ అవకాశం మాత్రం రాలేదు. కాని చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో కీలక పాత్రను రామ్ చరణ్ చేస్తాడని.. ఆ తర్వాత ఆ పాత్రను మహేష్ బాబు చేస్తాడంటూ ప్రచారం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఆ పాత్ర గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరకు మళ్లీ ఆ పాత్రను చరణ్ చేయబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

 

అంతేకాదు ఈ సినిమాలో చరణ్ కు జోడీగా హీరోయిన్ ఎవరు నటిస్తే బావుంటుంది అని చర్చ మొదలైందట. రకుల్ ప్రీత్ సింగ్, శృతి హాసన్, పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇలా వీరందరి గురించి అనుకున్నాక చివరకి కియారా అద్వానీని ఓకే చేసినట్లుగా తాజా సమాచారం. ఇన్ని రోజులు టాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండి నో చెబుతూ వచ్చిన కియారా అద్వానీ ఇప్పుడు కొన్ని డేట్స్ చేస్తూ చరణ్ కి ఓకే చెప్పిందని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా కోసం కియారా అద్వానీ నుండి 30 రోజుల పాటు డేట్లను ఈచిందట. అందుకోసం కోటి వరకు ఆఫర్ చేశారట మేకర్స్.

 

ఇక ప్రస్తుతం కియారా అద్వాని బాలీవుడ్ లో కిలాడి అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లక్ష్మీ బాంబ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రాఘవ లారెన్స్ నటించిన కాంచన సినిమాకి అఫీషియల్ గా రీమేక్ చేస్తున్నారు. దర్శకత్వం కూడా రాఘవ లారెన్స్ వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే కియారా అక్షయ్ సరసన ఒక సినిమాలో నటించింది.

 

అంతేకాదు ప్రస్తుతం ఈ బ్యూటి బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ తో బాడా మేకర్స్ నుంచి ఆఫర్స్ అందుకుంటుంది. దానికి తోడు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ అవుతుండటంతో బాలీవుడ్ లో డిమాండ్ బాగానే ఉంది. అయితే చరణ్ కియారాకి మద్య మంచి స్నేహం ఉందని అది కియారాకి చాలా గొప్పగా అనిపిస్తుందని ఇది పనిగట్టుకొని అందరికి చెప్పాల్సిన అవసరం లేదని అంటుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: