బాహుబలి వంటి భారీ విజయం తర్వాత సుజిత్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా చేయడం జరిగింది. దాదాపు 200 కోట్లకు పైగానే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు జరిగింది. కాగా సినిమా విడుదలైన మొదటి రోజే అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై ప్రభాస్ కూడా చాలా అంచనాలు పెట్టుకుంటే చివరాఖరికి మొదటి షోకే ప్లాప్ టాక్ రావటం ఊహించని విధంగా మైండ్ బ్లాక్ అయింది. ఇటువంటి టైం లో ప్రస్తుతం జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే వర్కింగ్ టైటిల్ సినిమా ప్రభాస్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సినిమా విషయంలో పట్టుబట్టి మరీ ‘సాహో’ కి జరిగిన మిస్టేక్ జరగకుండా ప్రభాస్ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నారు. అది దేనిలో అంటే మ్యూజిక్ విషయంలో. గత సినిమా సాహో లో పాటలు ప్రేక్షకులను అలరించలేకపోయింది. అందుకే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మరియు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చాలా జాగ్రత్తగా మ్యూజిక్ విషయంలో వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ కంపోజర్ మరియు సౌత్ ఆడియన్స్ కు సుపరిచితుడు అయిన అమిత్ త్రివేదితో ఈ సినిమాకు పాటలు చేయించాలని నిర్ణయించారు.

 

సైరా చిత్రంలో అమిత్ పాటలు ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాకు ప్రయోగం చేయకుండా అమిత్ తో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఎలా అయితే ట్యూన్స్ చేస్తారో అలా చేయించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన సిట్టింగ్స్ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా పాటలు ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: