తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘సాహెూ’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది.  ఈ చిత్రం బాలీవుడ్ లో తప్ప ఎక్కడా అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది.  అయితే  ఈ చిత్రంలో ఎక్కుడా బాలీవుడ్ నటులు ఉండటంతో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా రిసీవ్ చేసుకోలేక పోయారు.  ఈ చిత్రం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన జిల్ ఫేమ్ రాధకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు  ప్రభాస్.  ఈ చిత్రం మొన్నటి వరకు జార్జియాలో జరిగింది. అక్కడ కొన్ని ఛేజింగ్ సీన్లు తీశామని.. అత్యంగ చలి ప్రదేశం అయినా ప్రభాస్ ఎంతో గొప్పగా పనిచేశారని.. అయనకు ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పారు డైరెక్టర్ రాధకృష్ణ. 

 

ఆ చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కోసమే కరోనా వైరస్ ఉన్నప్పటికే దాన్ని లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేశామని అన్నారు.  తాజాగా ఈ చిత్రం  నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య త్వరలో ప్రభాస్ లుక్ వస్తుందని చిత్రయూనిట్ కూడా చెపింది. ఇక తాజాగా ప్రభాస్ లుక్ పై దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. 

 

ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుంది అని అభిమానులు గుడ్ న్యూస్ చెప్పారు.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.  అయితే ఈచిత్రం లో ప్రభాస్ చాలా కొత్త లుక్ తో కనిపిస్తాడని.. ఇప్పటి వరకు ప్రభాస్ ని చూస్తారని అన్నారు.  ఇది ఓ పిరియాడికల్ లవ్ స్టోరీ కావడంతో ఆ కాలం నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: