బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలేషన్ షిప్స్, బ్రేక్ అప్లు చాలా కామన్. చెట్టాపట్టాలేసుకు తిరిగిన చాలా మంది తారలు సడన్గా విడిపోతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హాట్ జోడి కూడా విడిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 15న అలియా భట్ తన పుట్టిన రోజును సన్నిహితులతో కలిసి జరుపుకుంది. అక్క షాహీన్తో పాటు ఆకాంన్ష రంజన్ కపూర్తో కలిసి కనిపించింది. అయితే ఈ పార్టీలో రణబీర్ కపూర్ లేకపోవటం చర్చనీయాంశమైంది.
తరువాత తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి రెండు కేకుల కట్ చేస్తూ పార్టీ చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది అలియా.. ఆ పార్టీలోనూ రణబీర్ కనిపించకపోవటంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే పార్టీలో అలియా తల్లి సోనీ రజ్దాన్తో పాటు రణబీర్ తల్లి నీతూ సింగ్ కూడా ఉండటం విశేషం. అలియా పుట్టిన రోజు తరువాత నటాషా ఓ ఆసక్తికర ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసింది.
చాలా కాలం కిందట రణబీర్ అలియాకు ముద్దు పెడుతుండగా తీసిని ఫోటోను పోస్ట్ చేసింది. చాలా కాలంగా రణబీర్, అలియాలు రిలేషన్ షిప్లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఆ ఇద్దరు ఆ వార్తలను ధృవీకరించటం గానీ, ఖండించటం గానీ చేయలేదు. దీంతో నిజంగానే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా అలియా బర్త్ డే నేపథ్యంలో రణబీర్, అలియాలు విడిపోయారన్న టాక్ వినిపిస్తోంది.