బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలేషన్‌ షిప్స్‌, బ్రేక్‌ అప్‌లు చాలా కామన్‌. చెట్టాపట్టాలేసుకు తిరిగిన చాలా మంది తారలు సడన్‌గా విడిపోతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్‌ హాట్ జోడి కూడా విడిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 15న అలియా భట్‌ తన పుట్టిన రోజును సన్నిహితులతో కలిసి జరుపుకుంది. అక్క షాహీన్‌తో పాటు ఆకాంన్ష రంజన్ కపూర్‌తో కలిసి కనిపించింది. అయితే ఈ పార్టీలో రణబీర్ కపూర్‌ లేకపోవటం చర్చనీయాంశమైంది.

 

తరువాత తన గర్ల్‌ గ్యాంగ్ తో కలిసి రెండు కేకుల కట్ చేస్తూ పార్టీ చేసుకున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది అలియా.. ఆ పార్టీలోనూ రణబీర్‌ కనిపించకపోవటంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే పార్టీలో అలియా తల్లి సోనీ రజ్దాన్‌తో పాటు రణబీర్‌ తల్లి నీతూ సింగ్ కూడా ఉండటం విశేషం. అలియా పుట్టిన రోజు తరువాత నటాషా ఓ ఆసక్తికర ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది.

 

చాలా కాలం కిందట రణబీర్‌ అలియాకు ముద్దు పెడుతుండగా తీసిని ఫోటోను పోస్ట్ చేసింది. చాలా కాలంగా రణబీర్‌, అలియాలు రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఆ ఇద్దరు ఆ వార్తలను ధృవీకరించటం గానీ, ఖండించటం గానీ చేయలేదు. దీంతో నిజంగానే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా అలియా బర్త్‌ డే నేపథ్యంలో రణబీర్‌, అలియాలు విడిపోయారన్న టాక్‌ వినిపిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

for life .. 👊🤙🤞 (how I spent my birthday)

A post shared by alia ☀️ (@aliaabhatt) on

మరింత సమాచారం తెలుసుకోండి: