ఈ మధ్య కొంత మందికి పాపులారిటి పిచ్చి పట్టింది అనే మాట అక్షరాలా నిజం. కొంత మందికి ఈ పిచ్చి మరీ తీవ్రంగా ఉంది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని కొంత మంది ఆ పిచ్చితో అనవసరంగా జనాలను ఇబ్బంది పెడుతున్నారు. టిక్ టాక్ లో ఫేస్బుక్ లో, యుట్యూబ్ లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేస్తున్నాడు. అతనికి అగ్ర దర్శకులు అవకాశాలు ఇస్తే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తనను ఇబ్బంది పెట్టి తన్నుకుపోయారు అని చెప్పుకున్నాడు. 

 

అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ కూడా అతనితో సినిమా చెయ్యాలని అనుకుంటే రామ్ చరణ్ అడ్డం పడ్డారు అని అతను చెప్పుకున్నాడు. అలాగే ఒక హీరోయిన్ కి తనకు ప్రేమ వ్యవహారం ఉందని తనను ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉందని మరికొందరు పెళ్ళికి అడ్డం పడి తనకు ఆమెను దూరం చేసారని అతను చెప్పుకున్నాడు. అలాగే గతంలో తాను సిబిఐ ఆఫీసర్ గా పని చేసాను అని కూడా చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం అతని వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని రూపం కూడా సోషల్ మీడియాలో జనాలకు మంచి వినోదం పంచుతుంది. 

 

ఇలా సోషల్ మీడియాలో జనం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మగాళ్ళు ఆడాళ్ళగా కనపడుతూ హడావుడి చేస్తున్నారు. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిచ్చితో జనాలు ఇబ్బంది పడుతున్నారని అనవసరంగా ప్రముఖులను ఇరికిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించడంతో యుట్యూబ్ చానల్స్ నిర్వహించే వాళ్ళు కూడా ఇంటర్వ్యు లు చేస్తూ జనాలను వినోదానికి గురి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: