టాలీవుడ్ లో బాలకృష్ణ సినిమాలు అనగానే చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది. బాలకృష్ణ సినిమాలు అంటే ఇలానే ఉంటాయి అనే అభిప్రాయం దర్శకులకు కూడా ఉండటంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రతిభ ఉన్న దర్శకులు ముందుకి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్ లో బాలకృష్ణ కు క్రేజ్ తగ్గింది అనే మాట వాస్తవం. ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో కొన్ని ప్రయోగాలు ఉంటాయని దర్శకుడు బోయపాటి బాలకృష్ణ కు చెప్పారాట. అఘోరా గా ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారు. హిమాలయాల్లో కొన్ని సీన్స్ ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హిమాలయాల్లో ఫైట్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. దీనికి బాలకృష్ణ దాదాపుగా నో చెప్పారని సమాచారం. ఆయన అంతగా ఆసక్తి చూపించలేదు అని టాక్. దీనితో దర్శకుడు కూడా వెనక్కు తగ్గారని అంటున్నారు. అలాగే ఆ సీన్స్ ని మార్చాలని కోరారు. దీనితో వెంటనే వాటిని మరో విధంగా మార్చుకున్నారట. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. ఆయన కోసం ఇప్పటికే క్రిష్ ఒక కథను కూడా రెడీ చేసాడని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తారట. బాలకృష్ణ కూడా త్వరగా సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. తన కుమారుడ్ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాని అతను మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. ఆయన సినిమాల మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: