మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరికైనా సంతోషమే. అలాంటి అవకాశం కోసం హీరోయిన్ల దగ్గర నుంచి చిన్న ఆర్టిస్టుల వరకూ ఎదురు చూస్తారు. కానీ.. ఈమధ్య చిరంజీవి సినిమాకు హీరోయిన్ అంటేను దొరకటం కష్టమైపోతోంది. మెగాస్టార్ నటిస్తున్న 152వ మూవీ ఆచార్య కోసం సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకున్నట్టు మొదటి నుంచీ వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా వారంలో షూటింగ్ అనగా త్రిష ఆచార్య నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని ఫిలింనగర్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

 

చిరంజీవి పక్కన త్రిష యాక్ట్ చేయడం మొదటి నుంచీ మెగా ఫ్యాన్స్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే త్రిషను సంప్రదించి ఆ షెడ్యూల్స్ ను కొద్దిగా లేట్ చేశారని అంటున్నారు. చిరంజీవి సరసన త్రిష తేలిపోతుందని రామ్ చరణ్ పై ఒత్తిడి తెచ్చారని కూడా అంటున్నారు. అందుకే ఇంతకాలం హీరోయిన్ విషయంలో ఎటువంటి అప్డేడ్ ను టీమ్ ఇవ్వలేదని సమాచారం. సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగా అడుగుతున్న త్రిషే హీరోయిన్ అని క్లారిటీ ఇవ్వలేదు. త్రిష ఆమధ్య చిన్న హింట్ ఇచ్చింది చిరంజీవి, మోహన్ లాల్ సినిమాలు చేస్తున్నా అని. కానీ.. ఇప్పుడు చిరంజీవి సినిమా నుంచి తప్పుకుంది.

 

 

దీని వెనుక మెగా అభిమానులు ఉన్నారని అంటున్నారు. వారి ప్రెషర్ తట్టుకోలేకే టీమ్ హీరోయిన్ మార్పుకు వెళ్లిందని అంటున్నారు. త్రిషను మొదట సంప్రదించారు కాబట్టి.. తీసుకోవటం లేదని చెప్పలేక క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తన చేతే మెసేజ్ పెట్టించేలా రామ్ చరణ్ మేనేజ్ చేయించాడని కూడా ఓ వార్త రౌండ్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ ప్రస్తుతానికి వైరల్ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: