మెగా హీరో  వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది యువ హీరోయిన్ కృతి శెట్టి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన లిరికల్ సాంగ్స్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందులో కృతి శెట్టి లుక్స్ కూడా అంతకుమించిన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఇంకా  ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే కృతి శెట్టి కి మరో ఛాన్స్ వచ్చింది.
 
యంగ్ హీరో నిఖిల్ నటించనున్న18 పేజెస్ అనే చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం జరుగుతుంది. ఉప్పెన కు మైత్రి మూవీ మేకర్స్ తోపాటు టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా నిర్మాత  గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ..  దాంతో ఉప్పెనలో కృతి నటన కు ఇంప్రెస్ అయిన సుకుమార్ 18 పేజెస్ లో ఛాన్స్ ఇప్పించినట్లుగా తెలుస్తుంది.18పేజెస్ కు సుకుమార్ కథ అందిస్తుండగా కరెంట్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
 
ఇదిలావుంటే వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన ఏప్రిల్ 2న విడుదలకావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తుంది. నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కతున్న ఈచిత్రంలో ప్రముఖ తమిళ నటుడు  విజయ్ సేతుపతి  విలన్ రోల్ లో నటిస్తునుండగా  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కావడం తో ఉప్పెన కు  మంచి హైప్ క్రియేట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: