తెలుగు ఇండస్ట్రీలో గోపిచంద్ హీరోగా జిల్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించాడు రాధా కృష్ణ.  ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకున్న గోపించంద్ కి మంచి పేరు వచ్చింది.  తాజాగా  రాధా కృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ చిత్రం రాబోతుంది.  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది.  ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావం ఉన్న విషయం తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  ఇప్పటికే ఐదు వేలకు పైగా మరణాలు సంబవించాయి. ఈ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు తమ షూటింగ్స్ వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే. 

 

 అలాంటి పరిస్థితిలో వెన్నుల్లో వణుకు పుట్టించే చలిలో ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్ పూర్తి చేసుకు వచ్చాయి. ఇటీవల రాధా కృష్ణ, ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే కూడా ఈ చిత్రం షూటింగ్ కోసం జార్జియాకు వెళ్లిన విషయం తెలిసిందే.  అక్కడ కొన్ని ఛేజింగ్ సీన్లు పూర్తి చేసుకొని వచ్చారట.  తాాజాగా ప్రభాస్ సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు తన అభిమానులలో జోష్ నింపుతోంది.  దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 31 వరకు యూరప్ ,  ఇతర దేశాల నుండి విమానాలను అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించడంతో చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్ ను తగ్గించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

 

ఈ సందర్భంగా ప్రైవేట్ జెట్ లో తీసుకున్న ఒక ఫోటోను దర్శకుడు రాధాకృష సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.  ఈ ఫొటోలో ప్రభాస్ తో పాటు దర్శకుడు రాధా కృష్ణ, చిత్ర నిర్మాత ప్రమోద్ , నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు ప్రైవేట్ జెట్లో ప్రయాణం చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ కొన్ని రోజులు విశ్రాంతి  తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది.  మరి తదుపరి షెడ్యూల్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: