ఈ డైలాగ్ దానవీర శూర కర్ణలో సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా హిట్ లో ఈ డైలాగ్ ది అగ్ర తాంబూలమే. ఇక సినీ గేయరచయితగా ఆచార్య ఆత్రేయ రికార్డులే స్రుష్టించారు. ఆయన కలం నుంచి జాలువారిన పాటలు తేనెల ఊటలు. అవి తెరస్మరణీయాలు.

 

అటువంటి ఆచార్య టైటిల్ చాలా పవర్ ఫుల్. పైగా మెగాస్టార్ హీరో అంటే ఆచార్య అదిరిపోవాల్సిందే. కానీ ఎందుకో ఆచార్య ఆల్ కన్ఫ్యూజన్ అన్నట్లుగా నత్తనడకగా సాగుతోంది. వంద రోజుల్లో మూవీ కంప్లీట్ కావాలని చిరంజీవి సరిలేరు నీకెవ్వరు ఆడియో ఫంక్షన్లో డైరెక్టర్ కొరటాలకు చెప్పారు. కానీ ఇప్పటికి ఇంకా పడుతూ లేస్తూనే ఉంది.

 

మధ్యలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మూవీ షూటింగుని నిలుపుచేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆచార్య షూటింగ్ మొదలుపెట్టినాక అనేక ట్రబుల్స్ అలా తోసుకువచ్చేస్తున్నాయని యూనిట్ కలవరపడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటికీ తేలలేదు. త్రిష అన్నారు ఆమె వెళ్ళిపోయింది.

 

కాజల్ అన్నారు. ఆమె  భారీ రెమ్యునరేషన్ అడిగిందని వద్దనుకున్నారని మరో టాక్. ఇక ఇపుడు అనుష్క అంటున్నారు. ఆమె సైతం కన్ ఫర్మ్ కాదని మరో టాక్ వస్తోంది. హీరోయిన్ల కధ ఇలా ఉంటే ఈ మూవీలో చిరంజీవితో సమానంగా ఉండే రెండవ పాత్ర ఎవరు చేస్తారు అన్న దాని మీద కూడా కన్ఫ్యూజన్ అలాగే  ఉంది.

 

మొదట కొడుకు రాం చరణ్ అనుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో క్లాష్ అవుతుందని మధ్యలో మహేష్ ని ముందుకు తెచ్చారు. ఇపుడు చూస్తే మళ్ళీ చరణ్ అంటున్నారు. అన్నట్లు ఈ మధ్యలో అల్లు అర్జున్ చేస్తారన్న మాట కూడా వినిపించింది. 

 

ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉందిట. ఈ మధ్య ఓ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి ఈ టైటిల్ రివీల్ చేశారని మరో టైటిల్ కోసం కొరటాలా ఆలోచన చేస్తున్నారుట. ఇద్దరు హీరోలు కాబట్టి మల్టీ స్టారర్ కి నప్పేలా టైటిల్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అన్ని కష్టాలూ అచార్యుడికే వచ్చేశాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: