టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమాతో విజయకేతనం మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా తో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అప్పుడే సినీ పరిశ్రమలోకి వచ్చిన హీరో ఇలా నాలుగు సినిమాలు వరుస విజయం అందుకోవడం అంత ఆశామాషీ కాదు. కానీ విజయ్ దేవరొకొండ అదృష్టం అలా కలిసి వచ్చింది.  ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు.  హైదరాబాద్‌ టైమ్స్‌ రిలీజ్‌ చేసిన 'మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019' జాబితాలో విజయ్‌ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు.  ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన మనసులోని విషయాలు బయట పెట్టారు.

 

మీ ప్రేమ విషయం గురించి చెప్పండి అన్న ప్రశ్నకు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ముక్కుసూటిగా జవాబిచ్చాడు.  ఒకవేళ తాను ప్రేమలో పడినప్పటికీ ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతానని తెలిపాడు. తన పర్సనల్‌ విషయం అందరికీ వినోదంగా మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే లేని ఎఫైర్లు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నారు.. ఆ విషయం చెబితే నా పరిస్థితి మీరు ఊహించుకోండి అన్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆ సీక్రెట్‌ను తన తల్లిదండ్రులకు, స్నేహితులకు మాత్రమే చెప్తానని చెప్పుకొచ్చాడు.

 

అందరికీ చాటింపు చేయడం నచ్చదని, అది ఎవరి వ్యాపారమూ కాదని రౌడీ ఘాటుగానే జవాబిచ్చాడు.  ఇక సినిమాల పరంగా ఎవరితోనైనా నటించేందుకు సిద్ధమేనని, అయితే బాలీవుడ్‌ హీరోయిన్లు కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చాడు. గతంలో జాన్వి కపూర్ సైతం అర్జున్ రెడ్డి గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛార్మీ నిర్మిస్తున్న ‘ఫైటర్’ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ తో పూరి మంచి జోష్ మీద ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: