టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ పూజా టాలీవుడ్ లో ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ మధ్య కన్నడ బ్యూటి రష్మిక మందన్న పూజా హెగ్డే కి గట్టి పోటీ ఇచ్చినప్పటికి పూజా రష్మిక ని తుంగలో తొక్కేసింది. ఇప్పుడు రష్మిక చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అదే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా. వాస్తవంగా చెప్పాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు గనక బ్లాక్ బస్టర్ అయుంటే రష్మిక కెరీర్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉండేది. కాని ఆ సినిమా హిట్  బ్లాక్ బస్టర్ హిట్ అవలేదు. అందులో ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న పెద్ద మైనస్ అన్న టాక్ వచ్చింది. దీంతో అమాంతం పూజా హెగ్డే క్రేజ్ పెరిగి రష్మిక క్రేజ్ పడిపోయింది.

 

టాలీవుడ్ లో యమా బిజీగా ఉన్న పూజా హెగ్డేకి  బాలీవుడ్ నుంచి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆఫర్ వచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయో సినిమాలో పూజా ని  రిఫెర్ చేశాడు సల్లు భాయ్. గతంలో టాలీవుడ్ ని కాదనుకొని హృతిక్ రోషన్ తో మొహంజాదారో సినిమాలో నటించి బాలీవుడ్ లో దాదాపు రెండేళ్ళు గడిపింది. కానీ ఆ సినిమా పూజాకి గట్టి షాకిచ్చింది. దాంతో ఇక బాలీవుడ్ లో దుకాణం కట్టేసి టాలీవుడ్ లో వచ్చి పడింది. ఇక్కడ వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలో మళ్ళీ బాలీవుడ్ లో సినిమా తర్వాత సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. 

 

ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా పూజాని ఎంపిక చేశారట. ఇద్దరు హీరోయిన్లు ఉన్నఈ సినిమాలో కృతి సనన్ కంటే పూజా ఎక్కువ హైలైట్ గా ఉండబోతుందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ పాత్ర గనక హిట్ అయితే బాలీవుడ్ లో పూజా సెటిల్ అయినట్టే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్న పూజా ఇప్పుడు అక్షయ్ కుమార్ తోనూ నటించబోతుంది. ఈ రెండు సినిమాలు గనక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయితే ఇక టాలీవుడ్ కి టాటా చెప్పాలని అనుకుంటుందట పూజా హెగ్డే. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: