టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎవరికీ చెప్ప అవసరం లేదు. అయితే రాజకీయాల్లోకి వెళ్లాక మరియు వయస్సు మీద పడ్డాకా సరికొత్త సమస్య మెగా బ్రదర్స్ కి ఏర్పడటంతో ఇండస్ట్రీ మొత్తం అయ్యో పాపం అంటుంది. ఇక పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇద్దరికీ చేస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్లు దొరకడం లేదు. మెగాస్టార్ కి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'సైరా' సినిమా కు ఎలాగోలా సినిమా హీరోయిన్ దొరికింది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్నా 'ఆచార్య' సినిమాకు ఇంకా హీరోయిన్ కన్ఫామ్ కాలేదు. చెన్నై బ్యూటీ త్రిష అనుకున్న తరుణంలో చివరి టైంలో ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాజల్ ని చేయించాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

అయితే పవన్ కళ్యాణ్ విషయానికొచ్చేసరికి ఇదే సమస్య ఎదురైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' లో పవన్ కు హీరోయిన్ ఇంకా దొరకలేదు. చాలా మంది పేర్లు ఎప్పటికీ వినపడ్డాయి. చివరాఖరికి శృతిహాసన్ కన్ఫామ్ అయ్యింది అని ఇండస్ట్రీ నుండి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే అక్కడా సమస్యలు తలెత్తాయన్నది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠీ పేరు వినిపించింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరీ లావణ్య త్రిపాఠీనా అని వారి ఆవేదన. దీంతో ఎలాగైనా శృతిని ఫిక్స్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.

 

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న నేపథ్యంలో సినిమాలో హీరోయిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు నిర్మాత దిల్ రాజు పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో దిల్ రాజు కూడా సరైన హీరోయిన్ పవన్ పక్కన పెట్టి సినిమా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తంమీద మెగా బ్రదర్స్ కి ఏజ్ బార్ ఎక్కువ అవటంతో సినిమా హీరోయిన్ల సమస్య ఎదురైంది అని ఇండస్ట్రీలో వార్తలు బలంగా వినబడుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: