ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. చైనా దేశంలో గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది . ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. ఇక కరోనా  వైరస్ పేరెత్తితే చాలు ప్రపంచ జనాలు మొత్తం వణికిపోయేలా ప్రభావితం చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఇక ఇప్పటికే 150 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే  ఇందులో భాగంగానే భారతదేశంలోకి ప్రవేశించింది ఈ మహమ్మారి వైరస్. దీంతో భారత ప్రజలందరిలో రోజురోజుకు ప్రాణభయం పెరిగిపోతూ ఉంది. 

 

 

 ఇక అటు భారత ప్రభుత్వం కూడా కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని కఠిన నిబంధనలు అమలులోకి తీసుకు వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు సహా పలు పబ్లిక్ ప్లేస్ లు  మూసివేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గం అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటన విడుదల చేసింది కూడా . ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

 

 

 ఈ నేపథ్యంలోనే ప్రజలు కరోనా  వైరస్ కు సంబంధించి నెలకొన్న భయాలను తొలగించేందుకు సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు సైతం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లోనే వర్కౌట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను కూడా షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫోటోలో తాను ఇంట్లోనే వ్యాయామం చేస్తూ కనిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని... సాధ్యమైనంత వరకు ఇంటి నుండే అన్ని పనులు చేసుకోవాలని... ఎక్కువగా జనాలు ఉండే ప్రదేశాలలో తిరగకూడదు అంటూ ఈ సందర్భంగా రకుల్ అందరికీ మెసేజ్ వచ్చింది. కాగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ దర్శకుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో షిమ్లా మిర్చి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: