తెలుగులో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న వాళ్లలో రష్మిక మందన్న, పూజా హెగ్డే ముందు స్థానాల్లో ఉన్నారు.స్టార్ హీరో సరసన నటించడానికి వీళ్ళిద్దరే ఆప్షన్ గా మారుతున్నారు. అయితే పూజా లేదంటే రష్మిక అన్నట్టు తయారైంది పరిస్థితి. రష్మిక ప్రస్తుతం అ;ల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రివేంజ్ డ్రామాలో పెల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. పూజా హెగ్డే ప్రభాస్ సరసన రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

మొదట్లో ఐరన్ లెగ్ గా అనిపించుకున్న పూజా వరుస హిట్లతో జోరు మీద ఉంది. అల వైకుంఠపురములో హిట్ తర్వాత ఆమె కథ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఆఫర్లు వరుస కడుతున్నాయి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న పూజకి సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించే అవకాశం వచ్చిందని టాక్. అయితే సాధారణంగా పూజాకి తెలుగులో కోటి నుండి కోటిన్నర వరకిపారితోషికం ఇస్తారు. 

 

కానీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సినిమాలో నాలుగు కోట్ల వరకి ఆఫర్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఇక ఆమెని తెలుగు సినిమాల్లో చూడలేమని తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్ లో అంత రెమ్యునరేషన్ ని పుచ్చుకున్నాక తెలుగులోనూ ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని చూస్తారు. అదీ గాక ఒకసారి బాలీవుడ్ లో సక్సెస్ తెచ్చుకున్నారంటే టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు.

 

కియారా అద్వానీ కబీర్ సింగ్ విజయం తర్వాత ఇలాగే చేసింది. తెలుగు నిర్మాతలు హీరోయిన్ కి అంతగా ఇచ్చుకోలేరు. మార్కెట్ పరంగా హీరోయిన్లకి అంత మొత్తంలో పారితోషికం ఇస్తే వర్కౌట్ అవ్వదని తెలుసు. అందుకే ఇక ముందు పూజా హెగ్డేని తెలుగు సినిమాల్లో చూడడం కష్టమే అని తెలుస్తుంది. అందుకే బుట్టబొమ్మ అందం ఇక తెలుగులో కనిపించదేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: