తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేడు ఆయన 70వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల ఆయన పుట్టిన రోజు వేడుకలు ఇంటి సభ్యుల మద్యనే జరుపుకుంటున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టిన రోజును, శ్రీవిద్యానికేతన్లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. అంతే కాదు కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శ్రీ విద్యానికేతన్ లో ఆయన పుట్టిరోజు వేడుకను ఓ పండుగలా జరుపుకుంటారు.. ఆ రోజు ప్రముఖులను ఆయన సత్కరిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం తన కుటుంబ సభ్యుల మద్యనే జరుపుకుంటున్నారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మోహన్ బాబు కి సినీ, రాజకీయ ప్రముఖులు హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మోహన్ బాబుకు ఆయన కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా లో ఆయన ఫోటోను పోస్ట్ చేసి ఆమనకు విషెస్ తెలిపారు.
ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. '' మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ! లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్. ' అని రాసుకొచ్చారు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
My nanas birthhhhhdayyyyyyy! Every year today is a celebration! You truly are one man army! love you to the moon and back! pic.twitter.com/T83BwBCKq0
— lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2020