అనుష్క శెట్టి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అరుంధతి, దేవసేన, భాగమతి లాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ ముద్దుగుమ్మ కోట్లలో అభిమానులను సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన అనుష్క… సినీ ప్ర‌స్థానంలో తాజాగా 15 వ‌సంతాలు కూడా పూర్తి చేసుకుంది. సూప‌ర్ సినిమాలో సాషా అనే ఒక మాస్ క్యార‌క్ట‌ర్‌తో త‌న కెరీర్‌ను ప్రారంభించిన స్వీటీ.. ఆ త‌ర్వాత చాలా క్లాస్ చిత్రాల్లో కూడా న‌టించి అనుష్క అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయికి చేరుకుంది. 

 

ఇక సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఈ భామ‌ భాగమతి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇలా చాలా గ్యాప్ త‌ర్వాత స్వీటి న‌టిస్తున్న చిత్రం నిశ్శబ్దం. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రాస్‌ ఓవర్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోనూ రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాను ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నాడు. మాధవన్‌, అంజలి, షాలిని పాండేలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడిసన్‌ కీ రోల్‌లో కనిపించనున్నాడు. 

 

ఇక ఈ చిత్రం ప్రోమోష‌న్స్‌లో భాగంగా అనుష్క.. ఈటీవీ మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో ఒకటైన “క్యాష్” ప్రోగ్రాం కు స్పెషల్ గెస్ట్ గా వచ్చి సంద‌డి చేయ‌నున్నారు. అనుష్క‌తో పాటు అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, హేమంత్ మధుకర్‌లు రాబోతున్నారు. ఇక ఈ షోలో యాంక‌ర్ సుమ ఎన్నో ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా.. అనుష్క త‌న‌దైన శైలిలో అన్స‌ర్లు ఇచ్చింది. అయితే అంతసేపు సరదాగా, ఫన్నీగా కనిపింపించిన స్వీటీ అనుష్క ఒక్కసారిగా సెట్‌లో ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది. అయితే అనుష్క ఏడ్చేయ‌డంతో సెట్‌లో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అయితే అనుష్క ఎందుకు ఎమోషనల్ అయ్యింది అనేది తెలియాలంటే మార్చి 21 శ‌నివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: